Watch Video: ఎన్నికల్లో విజయం కోసం అభిమానుల ఆరాటం.. మరీ ఇంత పిచ్చేంట్రా బాబు..
దేశ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ క్రమంలోనే తమ అభిమాన నాయకులు గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కారు. అలాగే కూటమి అధికారంలోకి రావాలని తిరుమలలో మరో అభిమాని పొర్లు దండాలు పెట్టాడు.
దేశ వ్యాప్తంగా మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ముఖ్యంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఆ క్రమంలోనే తమ అభిమాన నాయకులు గెలవాలంటూ ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయం సాధించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మోకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కారు. అలాగే కూటమి అధికారంలోకి రావాలని తిరుమలలో మరో అభిమాని పొర్లు దండాలు పెట్టాడు. ఇలా తమ అభిమాన హీరో కోసం కొందరు, నాయకుల కోసం మరికొందరు విన్నూత్న రీతిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవాలని దేవుడిని ఆరాధిస్తున్నారు. అటు అల్లూరి జిల్లాలోనూ వైసీపీ గెలవాలని మన్యం నేతలు గండి పోచమ్మ సన్నిధిలో కుంకుమ పూజ చేశారు. జగన్ మళ్లీ సీఎం కావాలంటూ గుడిలో వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలు కొట్టారు. పండితులతో జగన్ పేరుపై గండి పోచమ్మ అమ్మవారి దగ్గర ప్రత్యేక పూజలు చేయించారు మన్యం వైసీపీ నేతలు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తి భావనను ప్రదర్శించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
రోడ్డు మీద దీపం పెట్టిన భారతీయ మహిళ.. క్షుద్రపూజ జరిగిందా?
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?

