Telangana: ఉపాధి హామీ పనుల్లో తవ్వుతుండగా మెరుస్తూ కనిపించింది.. వెలికితీసి చూడగా
ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్వకాలు జరిపిన కూలీలకు.. మట్టిలో ఏదో గట్టిగా తగిలింది. గడ్డపారతో దాని చుట్టూ ఉన్న మట్టిని వెలికితీశారు. బయటపడింది చూసి అందరూ షాక్ అయ్యారు. కళ్లు జిగేల్ మనిపించేలా.. మధ్యయుగానికి చెందిన ఓ విగ్రహన్ని తవ్వి తీశారు.
జనగామ జిల్లా ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. శామీర్పేట్ గ్రామ శివారులో మధ్యయుగం కాలం నాటి విగ్రహం ఒకటి బయటపడింది. బుధవారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా.. ఈ విగ్రహం బయటపడట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. శామీర్పేట్ గ్రామ శివారులో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు తవ్వకాలు జరుపుతుండగా.. మట్టిలో ఒక్కసారిగా మెరుస్తూ పురాతన విగ్రహం ఒకటి కనిపించింది. దానిని వెలికితీసి ఆశ్చర్యపోయారు. అదొక మధ్యయుగం నాటి ఓ దేవత విగ్రహంలా ఉంది. స్థానికంగా ఉన్న చరిత్ర పరిశోధకులకు చూపించగా.. అది మధ్యయుగం కాలంనాటి విగ్రహం అయ్యి ఉండొచ్చునని భావిస్తున్నారు. ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కాగా, పురాతన విగ్రహం లభ్యం కావడంతో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు తరలివచ్చారు.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

