Telangana: పరిగిలో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన.. ఇదే ఇప్పుడు ట్రెండింగ్
పరిగి మున్సిపాలిటీ పరిధిలో బాలాజీ నగర్ కాలనీ వాసుల నిరసన ఇప్పుడు ట్రెండింగ్గా మారింది. రహదారిలో భారీ వర్షాలకు ఏర్పడిన గుంతల్లో వరినాట్లు వేసి స్థానికులు నిరసన చేపట్టారు. వాహనదారులు ఆ గుంతల్లోపడి గాయపడుతున్నారని వాపోయారు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో బాలాజీ నగర్ కాలనీ వాసులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి బాగు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. గుంతల రోడ్డులో వరినాట్లు వేసి నిరసన తెలిపారు స్థానికులు. వర్షాకాలం ప్రారంభం నుంచి కాలనీకి వెళ్లే దారి గుంతలమయమై చిత్తడిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్య జనం రోడ్డుపై వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు ఆధ్వాన్న స్థితిలో ఉన్నాయంటూ తెలుపుతూ తమ నిరసన వ్యక్తం చేశారు ఆందోళనకారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Aug 03, 2024 11:57 AM
Follow Us
వైరల్ వీడియోలు
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

