Geetha Singh: ఒక్కగానొక్క కొడుకుపోయిన బాధలో…
నార్త్ ఇండియాకు చెందిన గీతా సింగ్ లేడీ కమెడియన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో ఎవడి గోల వాడిదే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైంది. సినిమాలో లీడ్ రోల్ పోషించి ఆడియెన్స్ ను అలరించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే గత కొంత కాలంగా గీతా సింగ్ పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. 2019 తర్వాత కేవలం రెండు సినిమాల్లో మాత్రమే ఈమె కనిపించింది.
ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం గీతా సింగ్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కుమారుడు సడెన్ గా యాక్సిడెంట్ లో చనిపోవడంతో గీతా సింగ్ కోలుకోలేకపోయింది. ఫిబ్రవరి 18 గీతాసింగ్ కుమారుడి వర్ధంతి. ఈ సందర్భంగా తన కొడుకుకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిందామె. ‘తన కొడుకు తనతో ఉన్న మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా’ అంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు గీతా సింగ్ కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఖతర్నాక్ ఐడియా.. 15 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్న విద్యార్ధి..
ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా ?? అయితే ఇది మీ కోసమే!
గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!
గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు

