Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం

ఆ గ్రామానికి ఏమైంది? కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం

Phani CH

|

Updated on: Feb 21, 2025 | 7:33 PM

ఓ స్త్రీ రేపు రా.. ఇది జనానికి బాగా తెలిసిన మాట. గతంలో వీధుల్లో ఆడ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ గోడలు, తలుపుల మీద ఓ స్త్రీ రేపు రా అని బొగ్గుతో రాసేవారు. కానీ, ఓ ఆత్మా రేపు రా అంటున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీ వాసులు. అంతుచిక్కని మంటలు అక్కడి జనానికి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇదంతా ఓ ఆత్మ చేస్తున్న పనేనని భయభ్రాంతులకు గురవుతున్నారు అక్కడి ప్రజలు, గత కొద్ది రోజులుగా కంటిమీద కునుకు లేకుండా జాగారం చేస్తున్నారు.

ఎవరు కూడా పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంతవాసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మార్కండేయ కాలనీలో మళ్లీ గత కొద్ది రోజులుగా గుడిసెలపై నిప్పుల వర్షం కురుస్తోంది, ఎవరు వేస్తున్నారో తెలియదు, ఎందుకు జరుగుతుందో అసలే తెలియదు, కానీ గత కొద్ది రోజులుగా గుడిసెలకు మంటలు అంటుకోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు ఆ కాలనీవాసులు. ఇంట్లోని సామాన్లు, ఇంటి పైకప్పు కవర్లకు మంటలు అంటుకొని కాళీ బూడిదవుతున్నాయి. ఎప్పుడు ఏ వైపు నుండి మంటలు వ్యాపిస్తాయోనని కాపలాకాస్తున్నారు ఆ కాలనీవాసులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా ?? అయితే ఇది మీ కోసమే!

గుడి వద్ద ఓ ముక్క.. పొలంలో మరో ముక్క.. ఇది మాములు రాయి అనుకుంటే పొరపాటే

కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? పాలలో ఈ పొడి కలిపి తాగితే..

జంతువులు రెండు కాళ్లతో నడిస్తే ఇలా ఉంటుందా..

ఒక్క హగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం 20 సెకన్లలో