Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

బుర్జ్‌ ఖలీఫాలో ప్లాట్‌ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో..

Phani CH
|

Updated on: Jun 12, 2025 | 5:50 PM

Share

దుబాయ్ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బుర్జ్ ఖలీఫానే. సుమారు 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తుల ఈ భవనం దుబాయ్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఎత్తైన భవనం. 2004లో ప్రారంభమైన ఈ భవనం నిర్మాణ పనులు 2010లో పూర్తయ్యాయి. అంటే సుమారు ఆరేళ్ల పాటు శ్రమించి ఈ భవనాన్ని కట్టారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా దుబాయ్ కు వెళితే ఈ బుర్జ్ ఖలీఫాను సందర్శించాల్సిందే.

భవనం దగ్గర నిలబడి సరదాగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవాల్సిందే. అలాంటి ఈ ఎత్తైన కట్టడంలో పలువురు కోటీశ్వరులు, సెలబ్రిటీలు ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్నారు. అలా బుర్జ్ ఖలీఫాలో స్టార్ హీరో మోహన్ లాల్.. తన బార్య కోసం సింగిల్ బెడ్ రూమ్‌ని కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు.ఇలా మొత్తానికి బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా రికార్డు సృస్టించాడు ఈ హీరో. దీంతో ఈ న్యూస్‌తో ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నాడు మోహన్ లాల్. మోహన్ లాల్ గతంలో బుర్జ్ ఖలీఫాలోని 29వ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్ రూమ్ ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం సుమారు రూ.3.5 కోట్లు ఖర్చు పెట్టాడు. ఈ ఫ్లాట్‌ను తన భార్య సుచిత్ర పేరిట రిజిస్టర్ చేయించాడు ఈ స్టార్ హీరో. ఇక టాలీవుడ్ హీరోల్లోనూ మహేశ్ బాబు, అల్లు అర్జున్‌కి దుబాయిలో అపార్ట్‌మెంట్స్ కొనుగోలు చేశారనే టాక్ ఉంది. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. బుర్జ్‌ ఖలీఫా లో ఫ్లాట్ మాత్రమే కాదు.. ఓ విల్లాను కూడా సొంతం చేసుకన్నారట మోహన్ లాల్. లావిష్‌ 3 బీహెచ్‌కే అయిన ఈ విల్లా కూడా చాలా ఖరీదైందని… చూడ్డానికి కళ్లు చెదిరేలా ఉంటుందని టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్.. ఉస్తాద్‌ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్

పూర్తిగా పాడైన కోట కాళ్లు.. ఏకంగా కాలి వేళ్లు తీయాల్సిన పరిస్థితి

విచిత్రం.. భూమి లోపల చంద్రుడి అవశేషాలు

సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు

అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది