సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు
విశ్వాసానికి శునకాన్ని మించిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. తనకు అన్నం పెట్టిన యజమానిని, అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. తనకు నీడనిచ్చిన ఇంటి రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. అలాంటి ఓ శునకం తన యజమాని చనిపోవడంతో అది జీర్ణించుకోలేని ఆ మూగజీవి అతని రాకకోసం అతని సమాధి వద్దే తిరుగుతూ ఎదురుచూస్తోంది.
ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో జరిగింది. జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య అనే వ్యక్తి ఇటీవలే కారు ప్రమాదంలోచనిపోయాడు. అతను ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. రాజు అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ శునకం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ శునకానికి కూడా కొమురయ్య అంటే అంతే ఇష్టం. అతను చేత్తో పెడితేనే ఆహారం తింటుంది. ఎక్కడికి వెళ్లినా కొమురయ్య వెంటే ఉండేది ఆ శునకం. అయితే కొమురయ్య చనిపోయాడని, ఇక తిరిగిరాడని తెలియని ఆ మూగజీవి అతని రాకకోసం ఎదురుచూస్తోంది. కొమురయ్య అంత్యక్రియలో పాల్గొన్న ఆ శునకానికి కొమురయ్యను భూమిలో ఎందుకు పూడ్చుతున్నారో అర్థం కాని ఆ ప్రాణి ప్రతిరోజూ అతని సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు పడుకొని ఇంటికి వస్తోంది. అతన్ని పిలుస్తూ సమాధి చుట్టూ తిరుగుతోంది. కొమురయ్య కుటుంబ సభ్యులు దానికి ఆహరం పెట్టినా తినకుండా యజమాని కోసం మూగగా రోధిస్తోంది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి స్టైల్గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్కి దిమ్మతిరుగుద్ది
తహసీల్దారుకే కుచ్చు టోపీ పెట్టిన కేటుగాడు.. ఏం చేశాడంటే
నా లవర్తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్ క్యాచర్కు నాగుపాము కృతజ్ఞత..
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్కూ పెరిగిన డిమాండ్ !!
ఇంతందంగా ఉన్నావే.. నెలవంకలా భూమి
క్రికెట్ మ్యాచ్లో వివాదం.. కత్తిపోట్లతో యువకుడి మృతి

