Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు

సమాధి వద్దే యజమాని రాక కోసం కుక్క ఎదురుచూపులు

Phani CH
|

Updated on: Jun 12, 2025 | 4:47 PM

Share

విశ్వాసానికి శునకాన్ని మించిన జంతువు మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. తనకు అన్నం పెట్టిన యజమానిని, అతని కుటుంబానికి రక్షణగా నిలుస్తుంది. తనకు నీడనిచ్చిన ఇంటి రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. అలాంటి ఓ శునకం తన యజమాని చనిపోవడంతో అది జీర్ణించుకోలేని ఆ మూగజీవి అతని రాకకోసం అతని సమాధి వద్దే తిరుగుతూ ఎదురుచూస్తోంది.

ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జరిగింది. జిల్లాలోని కనుకుల గ్రామానికి చెందిన తాళ్లపల్లి కొమురయ్య అనే వ్యక్తి ఇటీవలే కారు ప్రమాదంలోచనిపోయాడు. అతను ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. రాజు అంటూ ముద్దుగా పిలుచుకునే ఆ శునకం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ శునకానికి కూడా కొమురయ్య అంటే అంతే ఇష్టం. అతను చేత్తో పెడితేనే ఆహారం తింటుంది. ఎక్కడికి వెళ్లినా కొమురయ్య వెంటే ఉండేది ఆ శునకం. అయితే కొమురయ్య చనిపోయాడని, ఇక తిరిగిరాడని తెలియని ఆ మూగజీవి అతని రాకకోసం ఎదురుచూస్తోంది. కొమురయ్య అంత్యక్రియలో పాల్గొన్న ఆ శునకానికి కొమురయ్యను భూమిలో ఎందుకు పూడ్చుతున్నారో అర్థం కాని ఆ ప్రాణి ప్రతిరోజూ అతని సమాధి వద్దకు వెళ్లి అక్కడే కాసేపు పడుకొని ఇంటికి వస్తోంది. అతన్ని పిలుస్తూ సమాధి చుట్టూ తిరుగుతోంది. కొమురయ్య కుటుంబ సభ్యులు దానికి ఆహరం పెట్టినా తినకుండా యజమాని కోసం మూగగా రోధిస్తోంది. ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి స్టైల్‌గా సిగరెట్ తాగుతూ వచ్చాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్‌కి దిమ్మతిరుగుద్ది