Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వయనాడ్‌ బాధితులకు.. మెగాస్టార్‌ చిరంజీవి భారీ విరాళం

వయనాడ్‌ బాధితులకు.. మెగాస్టార్‌ చిరంజీవి భారీ విరాళం

Phani CH

|

Updated on: Aug 06, 2024 | 9:22 PM

వయనాడ్‌ బాధితులను ఆదుకునేందకు సౌత్‌ ఇండియా సినిమా హీరోలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అ‍ల్లు అర్జున్‌ మొదటగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు.

వయనాడ్‌ బాధితులను ఆదుకునేందకు సౌత్‌ ఇండియా సినిమా హీరోలు ఒక్కొక్కరిగా ముందుకు వస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అ‍ల్లు అర్జున్‌ మొదటగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ భారీ విరాళం అందించి తమ మంచి మనసు చాటుకున్నారు. గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం వల్ల వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యానని చిరంజీవి తన X ఖాతాలో పోస్ట్‌ చేశారు. వారికి అండగా నిలిచేందుకు తమ వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1 కోటి విరాళం అందిస్తున్నట్లు చిరంజీవి, చరణ్‌ తెలిపారు. జల ప్రళయం వల్ల నష్టపోయి బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని, ఆ భగవంతుడు వారికి ఆ శక్తిని అందించాలని ప్రార్థిస్తున్నట్లు తన ఎక్స్‌ పేజీలో మెగాస్టార్ పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Visakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదాన్ని ముందు గుర్తించింది ఇతడే

ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. మధ్య ప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు

Ismart news: ఎరక్కపోయి వెళ్లారు.. ఇరుక్కుపోయారు.. టెన్షన్‌లో నాసా..

25 నిమిషాలు ఆగి మళ్లీ కొట్టుకున్న గుండె !! ఏదో అద్భుతం జరిగిందన్న వైద్యులు

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను పోలిన లక్షణాలు