OTTలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక.. మీరు కూడా ఆ కంటెంట్ చూస్తున్నారా?
ఇండియాస్ గాట్ టాలెంట్ కార్యక్రమంలో రణ్వీర్ అల్హాబాదియా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. ఓటీటీలు, సోషల్ మీడియాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఐటీ రూల్స్ 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. చిన్నారులకు A రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది.
ఓటీటీ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్లపై ఫిర్యాదులు అందాయని… ఓటీటీ సంస్థలు అన్ని కూడా తప్పకుండా నైతిక విలువలను పాటించాలని వెల్లడించింది. ఇక నుంచి వయస్సు ఆధారిత కంటెంట్ మాత్రమే అందుబాటులో ఉండాలని సూచించింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల రణ్వీర్ చేసిన కామెంట్స్పై పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కూడా రణ్వీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. వాక్ స్వాతంత్ర్యం పేరుతో సామాజిక కట్టుబాట్లను గాలికొదిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా.? అంటూ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ను నియంత్రించడానికి ఏవైనా చర్యలు తీసుకొనే యోచనలో ఉన్నారా..? అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు సైతం జారీ చేసింది. దీనిపై చర్చ నడుస్తున్న క్రమంలో ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్పై కేంద్రం ప్రకటన జారీ చేసింది. అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ను అసలు ప్రసారం చేయకూడదని హెచ్చరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Marco: ఆహాలో దూసుకుపోతున్న మార్కో
మనీలాండరింగ్ కేసులో బుక్కైన శంకర్.. దాదాపు 10 కోట్ల ఆస్తులు జప్తు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

