Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఓర్నీ పాసుగోల..! గుంటూరులో ఫ్రీ చికెన్‌ విందు.. ఎగబడిన జనం

AP News: ఓర్నీ పాసుగోల..! గుంటూరులో ఫ్రీ చికెన్‌ విందు.. ఎగబడిన జనం

Ravi Kiran

|

Updated on: Feb 21, 2025 | 8:34 PM

గుంటూరు నగరంలోని స్వామి ధియేటర్ ప్రాంగణంలో చికెన్ వంటకాలతో ఉచిత ఆహార పంపిణీ చేశారు. చికెన్ కోడిగ్రుడ్లుపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు పౌల్ట్రీ నిర్వాహకులు. దీంతో భారీగా జనం హాజరయ్యారు.ప్రాంగణం నిండిపోవడంతో గేట్లు మూసేశారు నిర్వాహకులు. ఆ వివరాలు ఇలా.

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపధ్యంలో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్న వేళ పలువురు అవగాహన కల్పిస్తూ చికెన్, ఎగ్ స్నాక్స్ ఫ్రీగా అందించారు. ఈ మేళాలకు జనాలు ఎగబడటంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ గ్రౌండ్‌లో, హైదరాబాద్‌లోని ఉప్పల్ గణేశ్‌నగర్ వద్ద ఫుడ్ మేళాలు నిర్వహించగా జనల తాకిడికి నిర్వాహకులు చేటులెత్తేశారు. గుంటూరులో రద్దీ తట్టుకోలేక గేట్లు మూసేశారు. ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

ఇది చదవండి: బాలిక కడుపులో చిత్రవిచిత్ర శబ్దాలు.. భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రేలో

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Feb 21, 2025 08:32 PM