Car In Flood Viral Video: వరద నీటిలో కారు ప్రయాణం.. ఆశ్చర్యపోయానన్న ఆనంద్ మహీంద్ర..!(వీడియో)
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారాయన. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఒకరు. సమాజంలో జరిగే అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారాయన. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్ర చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. గుజరాత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాజ్ కోట్ పట్టణం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయింది. రోడ్లపై నీరు వాగులను తలపించింది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితిలోనూ అక్కడి పోలీసులు రెస్క్యూ కోసం వరద నీటిలో కారులో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది.
అయితే ఈ వీడియోలో పోలీసులు ప్రయాణించింది మహీంద్ర కంపెనీకి చెందిన బొలేరో వాహనం. దీంతో ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తి మహీంద్రాకు ఇది సాధ్యమే అనే క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ వీడియో వైరల్ అవుతూ చివరికి ఆనంద్ మహీంద్ర కంట పడింది. దీంతో ఈ ట్వీట్ను రీట్వీట్ చేసిన ఆనంద్.. ఇది నిజమేనా..? ఇటీవల వర్షాలు కురిసిన సమయంలోనేనా.? నేను కూడా ఆశ్చర్యపోతున్నాను అంటూ క్యాప్షన్ జోడించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Khairatabad Ganesh: నిమజ్జనానికి సిద్ధమవుతున్న ఖైరతాబాద్ గణపతి(వీడియో)
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
పొలంలో బంగారు నిధులు.. కౌలుకు తీసుకునేందుకు రైతుల పోటీ
బెల్ట్ షాపులకు షాక్ ట్రీట్మెంట్.. మద్యం అమ్మితే కరెంట్ కట్!
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

