అయోధ్యకు.. మధ్యప్రదేశ్‌ నుంచి ఐదు లక్షల లడ్డూలు

అయోధ్యకు.. మధ్యప్రదేశ్‌ నుంచి ఐదు లక్షల లడ్డూలు

|

Updated on: Jan 16, 2024 | 7:05 PM

ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. ప్రతిష్ఠాపనకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన... భారత సాంస్కృతిక, ఆథ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి.

ఆయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది. ఈ నెల 22న భవ్య రామమందిరంలో బాలరాముడు కొలువుదీరనున్నాడు. ఈ నేపథ్యంలో అయోధ్య నగరం కొత్తరూపు సంతరించుకుంటోంది. ప్రతిష్ఠాపనకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్న తరుణాన… భారత సాంస్కృతిక, ఆథ్యాత్మిక వైభవాన్ని చాటేలా అయోధ్యను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముడికి దేశ, విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కోసం లడ్డూ ప్రసాదాలు తయారవుతున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి ఏకంగా ఐదు లక్షల లడ్డూలు తరలి వెళుతున్నాయి. ఈ లడ్డూల తయారీని మధ్యప్రదేశ్‌ CM మోహన్‌ యాదవ్‌ పర్యవేక్షించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల సమయమే ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రామమందిర ప్రారంభానికి ఆ దేశంలో ఉద్యోగులకు సెలవు

Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం

స్కూల్‌ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!

ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి

అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

Follow us