AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూల్‌ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!

స్కూల్‌ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!

Phani CH
|

Updated on: Jan 15, 2024 | 6:31 PM

Share

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్‌గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్‌ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్‌ చేశారని వంట మనిషి ఆరోపించింది.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్‌టా బ్లాక్‌లోని అప్‌గ్రేడెడ్‌ మిడిల్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తుకు ఆదేశించింది. మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్‌ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్‌ చేశారని వంట మనిషి ఆరోపించింది. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే తనపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలను వంట చెరకుగా వాడుకోమని చెప్పింది తాను కాదని, స్కూలు ప్రిన్సిపాల్‌ అని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ మాత్రం దీనిని ‘మానవ తప్పిదం’గా కొట్టిపడేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి

అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్‌ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్

ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు

సంతానలేమికి కారు సీటూ కారణం కావొచ్చు.. ఎలాగంటే ??