AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం

Hyderabad : 400 ఏళ్ల పురాతన ఆలయంలో మల్లన్న కళ్యాణం

Phani CH
|

Updated on: Jan 15, 2024 | 6:32 PM

Share

సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో కొలువై ఉన్న మల్లన్న స్వామి కళ్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్‌లో 400 సంవత్సరాల పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన సైదాబాద్ కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మల్లికార్జునస్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో కొలువై ఉన్న మల్లన్న స్వామి కళ్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించారు. భాగ్యనగర్‌లో 400 సంవత్సరాల పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన సైదాబాద్ కరణ్ బాగ్ మల్లికార్జున స్వామి ఆలయంలో కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మల్లికార్జునస్వామి కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒగ్గు పూజారి మారయ్య బృందం ఆధ్వర్యంలో మల్లన్న కళ్యాణం నిర్వహించారు. ఉత్సవాల రెండవరోజు పటం వేసి, అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్‌ బెంచీలనే విరగ్గొట్టి వంట చెరకుగా వాడేశారు !!

ఎయిర్‌పోర్టు ఏరోబ్రిడ్జిపై ఇరుక్కుపోయిన నటి

అబార్షన్‌కు నిరాకరించిన యువతి !! సైకో బాయ్‌ ఫ్రెండ్‌ ఏం చేశాడంటే ??

AI టెక్నాలజీతో అక్కినేనిని మోడర్న్‌ ఫొటోలు.. నెట్టింట ట్రెండ్

ఇన్ స్టా స్టోరీస్ లో మెగా కోడళ్ల ఆసక్తికర పోస్టులు