ఇదేదో విందు భోజనం అనుకుంటే పొరపాటే.. అసలు మ్యాటర్ తెలిస్తే బిత్తరపోతారు
పాఠశాల భోజనం అనగానే అందరికీ గుర్తొచ్చేది రుచిలేని కిచిడీ లేదా చల్లటి గట్టి రోటీలు గుర్తుకువస్తాయి. కానీ, సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఈ అభిప్రాయాన్ని మార్చేసింది. స్కూల్ పిల్లల భోజనాన్ని చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. దాన్ని చూస్తే పెద్దలు సైతం తాము మళ్లీ చిన్నపిల్లలుగా మారి మళ్లీ స్కూల్కి వెళ్లాలని కోరుకుంటున్నారు. ఆ వంటగది ఒక హై-టెక్ ల్యాబ్లా కనిపిస్తుంది. అక్కడ సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించి ఎంతో శుభ్రంగా, శ్రద్ధగా భోజనం తయారుచేస్తుంటారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పిల్లల ఎదుగుదలలో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో దక్షిణ కొరియా అనుసరిస్తున్న విధానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్కడి పాఠశాల భోజన పద్ధతులు ఒక మోడల్ లాగా కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియా పాఠశాలల్లో పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనానికి (School Lunch) సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యవంతులైన పిల్లలు అక్కడ ఉండటానికి గల రహస్యాన్ని ఈ వీడియో వెల్లడిస్తోంది.
దక్షిణ కొరియా పాఠశాల భోజనంలో పోషకాల సమతుల్యత కచ్చితంగా ఉంటుంది. ప్రోటీన్ కోసం మాంసం, చేపలు వంటివి అందిస్తున్నారు. తాజా ఆకుకూరలు, ఉడికించిన కూరగాయలు ఉన్నాయి. ఇది కొరియా సంప్రదాయ వంటకం. ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఇది జీర్ణక్రియకు, రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది. తక్కువ నూనెతో చేసిన పోషకభరితమైన సూప్ కూడా అందిస్తున్నారు. ఈ వీడియోలో కేవలం ఆహారమే కాదు, పిల్లలు అనుసరించే పద్ధతులు కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పాఠశాలలో కఠినమైన పరిశుభ్రత నియమాలు ఉంటాయి. భోజనం వడ్డించే వారు, స్వీకరించే పిల్లలు కూడా పక్కాగా నిబంధనలు పాటిస్తారు. భోజనం తర్వాత పిల్లలు తమ దంతాలను శుభ్రం చేసుకోవడం (Brushing) కూడా అక్కడి పాఠశాల సంస్కృతిలో భాగం.
వీడియో ఇక్కడ చూడండి..
The care and precision behind Korean school lunches, widely praised for their quality, balance, and nutrition. pic.twitter.com/EW4QXWJ0Sv
— Interesting World (@_fluxfeeds) April 11, 2026
ఎందుకు ఇది గొప్పది?:
దక్షిణ కొరియా ప్రభుత్వం పాఠశాల భోజనంపై భారీగా పెట్టుబడి పెడుతుంది. జంక్ ఫుడ్కు దూరంగా, ఇంట్లో వండిన ఆహారం వంటి రుచి, నాణ్యతను పాఠశాలల్లో అందిస్తారు. దీనివల్ల పిల్లలలో ఏకాగ్రత పెరగడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే జీవనశైలి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మనం తినే ఆహారమే మనం అనే సూత్రాన్ని దక్షిణ కొరియా అక్షరాలా పాటిస్తోంది. ఇతర దేశాలు కూడా తమ మధ్యాహ్న భోజన పథకాల్లో ఇలాంటి మార్పులు తీసుకురావాలని నెటిజన్లు కోరుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…




