AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖ ఫుడ్‌ కంపెనీపై రూ. 40 కోట్ల దావా వేసిన యువతి.. కారణం ఏంటంటే..

కంపెనీ ప్రకటనలో పేర్కొన్న దానికంటే వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని వారి ఫిర్యాదు.

ప్రముఖ ఫుడ్‌ కంపెనీపై రూ. 40 కోట్ల దావా వేసిన యువతి.. కారణం ఏంటంటే..
Mac And Cheese
Jyothi Gadda
|

Updated on: Nov 29, 2022 | 8:47 AM

Share

ఒక కంపెనీ ఎలాంటి ఉత్పత్తిని విక్రయించినా అది ఇచ్చే ప్రకటనలు, క్లెయిమ్ చేసే అంశాలు నిజం కాదని తేలితే మాత్రం.. అది న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో కస్టమర్ స్వయంగా కేసు నమోదు చేయవచ్చు. యుఎస్‌లో జరిగిన ఇలాంటి సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని విచిత్రంగా ఆకర్షిస్తోంది. కంపెనీ ప్రకటనలో పేర్కొన్న దానికంటే వంట చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని వారి ఫిర్యాదు. సౌత్ ఫ్లోరిడాకు చెందిన అమండా రామిరేజ్ అనే మహిళ ఈ ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..

వారు క్రాఫ్ట్ హీన్జ్ నుండి మాకరోనీ, జున్ను కొనుగోలు చేశారు. మూడున్నర నిమిషాల్లో వండవచ్చని కంపెనీ ప్రచారం చేసింది. ఈ యాడ్‌ని చూసిన తర్వాత వారు ఎనిమిది కప్పులను కొనుగోలు చేశారని యాడ్ హైలైట్ చేస్తుంది. అయితే, ప్రిపేర్ కావడానికి పట్టే సమయం యాడ్‌లో చెప్పినట్లు లేదు. వంటకం తయారీలో వివిధ దశల్లో ఇది ఒకటి మాత్రమేనని, అలా చేస్తే అది వినియోగదారులను మోసగించినట్లేనని, కంపెనీ చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని పలు అంశాలను పేర్కొంటూ భారీ మొత్తంలో దావా వేశారు. 40 కోట్ల రూపాయల (మిలియన్ డాలర్లు) కోసం కేసు పెట్టారు.

అయితే ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కోవాలని కంపెనీ నిర్ణయించింది. ఆమె ఫిర్యాదులో అమండా లేవనెత్తిన అన్ని అంశాలను తాము తిరస్కరించగలమని వారు విశ్వసిస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు. కస్టమర్లు ఉత్పత్తుల బరువు, నాణ్యతతో సహా ప్రకటనలలో ఇచ్చిన వ్యాఖ్యాన్ని చెక్‌ చేసుకోవచ్చాన్నారు. ఈ వాదనలు తప్పు అని తేలితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ నిజం ఏమిటంటే, చాలా మంది వినియోగదారులు తరచుగా ప్రకటనలలో చేసిన క్లెయిమ్‌లను వాస్తవికతతో పోల్చడానికి ఇష్టపడరు. వారు అలా చేస్తే ఫిర్యాదు చేయడానికి కూడా ఇష్టపడరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి