AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి బోనస్ పట్ల గుస్సా.. టోల్ సిబ్బంది రివేంజ్..! వాహనదారులకు పండగే పండగ

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద దీపావళి బోనస్ తక్కువగా రావడంతో సిబ్బంది నిరసన తెలిపారు. కంపెనీపై కోపంతో టోల్ గేట్లు తెరిచి, రెండు గంటల పాటు వాహనదారులందరినీ ఉచితంగా వెళ్లనిచ్చారు. పోలీసుల జోక్యంతో, కంపెనీ జీతాలు పెంచుతామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

దీపావళి బోనస్ పట్ల గుస్సా.. టోల్ సిబ్బంది రివేంజ్..! వాహనదారులకు పండగే పండగ
SN Pasha
|

Updated on: Oct 21, 2025 | 1:29 PM

Share

సాధారణంగా టోల్‌ వద్దకు వెళ్లానే టోల్‌ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌తో ఆటోమేటిక్‌గా టోల్‌ ఛార్జ్‌ కట్‌ అవుతుంది. అయితే టోల్‌ సిబ్బందికి దీపావళి బోనస్‌ తక్కువగా ఇవ్వడంతో.. అది వాహనదారులకు కలిసొచ్చింది. టోల్‌ గేట్‌ నిర్వహిస్తున్న కంపెనీపై కోపంతో సిబ్బంది వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేయకుండా అందర్ని ఫ్రీగా వెళ్లనిచ్చారు. టోల్‌ కంపెనీకి, సిబ్బందికి దీపావళి బోనస్‌ విషయంలో వచ్చిన వివాదం.. వాహనదారులకు పండగలా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది అన్ని గేట్లను తెరిచి, వేలాది వాహనాలు టోల్ ఛార్జీలు చెల్లించకుండానే ప్రయాణించడానికి వీలు కల్పించారు. దీపావళి బోనస్ కేవలం రూ.1100 మాత్రమే ఇవ్వడంతో కంపెనీపై కోపంతో ఇలా చేశారు. ఈ వివాదం టోల్ కార్యకలాపాలకు రెండు గంటల పాటు అంతరాయం కలిగించింది. ఇది పోలీసుల జోక్యానికి దారితీసింది. టోల్ అధికారులు 10 శాతం జీతం పెంపునకు హామీ ఇవ్వడంతో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

దీపావళి బోనస్‌పై టోల్ సిబ్బంది నిరసన

శ్రీ సైన్ అండ్‌ దాతర్ నిర్వహిస్తున్న ఫతేహాబాద్ టోల్ ప్లాజాలో 21 మంది ఉద్యోగులు దీపావళి బోనస్ కేవలం రూ.1100 మాత్రమే ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చిలో కంపెనీ టోల్ నిర్వహణను చేపట్టింది, దీని ఫలితంగా బోనస్ లెక్కలపై భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అయితే బోనస్‌ మరీ తక్కువ రావడంతో సిబ్బంది నిరసనకు దిగారు. తమ విధులను నిలిపివేసి, అన్ని టోల్ గేట్లను తెరిచారు, దీని వలన వేలాది వాహనాలు అడ్డంకులు లేకుండా ప్రయాణించడానికి వీలు కలిగింది. ప్రత్యామ్నాయ సిబ్బందిని తీసుకురావడానికి యాజమాన్యం చేసిన ప్రయత్నాలను నిరసన తెలిపిన ఉద్యోగులు అడ్డుకున్నారు, దీంతో పరిస్థితి మరింత దిగజారింది. శాంతిభద్రతలను కాపాడటానికి, కార్మికులు, టోల్ కంపెనీ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎట్టకేలకు జీతాలు పెంచుతామని కంపెనీ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి