AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలిడే హర్రర్.. సముద్రం మధ్యలో పడిపోయిన టూరిస్ట్‌ల సామాను..షాకింగ్‌ వీడియో వైరల్‌

కో టావో నుండి థాయిలాండ్‌లోని కో స్యామ్యూయ్ ప్రయాణిస్తున్న ఫెర్రీ నుండి డజన్ల కొద్దీ పర్యాటకుల లగేజీ సముద్రంలో పడిపోయింది. ఈ నిర్లక్ష్యం వల్ల చాలా మంది పాస్‌పోర్ట్‌లు, విలువైన వస్తువులు పోయాయి. పరిహారం పేరుతో పర్యాటకులకు జరిగిన చికిత్స మరిన్ని ప్రశ్నలను లేవనెత్తింది. పూర్తి కథనం తెలుసుకోండి.

హాలిడే హర్రర్.. సముద్రం మధ్యలో పడిపోయిన టూరిస్ట్‌ల సామాను..షాకింగ్‌ వీడియో వైరల్‌
Tourist Luggage Lost At Sea
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2025 | 6:54 PM

Share

థాయిలాండ్‌లోని కో టావో, కో స్యామ్యూయ్ దీవుల మధ్య ప్రయాణిస్తున్న ఫెర్రీ నుండి డజన్ల కొద్దీ పర్యాటకుల లగేజ్ సముద్రంలో పడిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. పాస్‌పోర్ట్‌లు, విలువైన వస్తువులు పోవడంతో పర్యాటకులు తీవ్రంగా నష్టపోయారు. కంపెనీ నష్టపరిహారం ఇవ్వడానికి నిరాకరించడం విమర్శలకు దారితీసింది. ఈ సంఘటన థాయిలాండ్ పర్యాటక రంగంలో భద్రత లోపాలను వెల్లడించింది.

థాయిలాండ్‌లోని కో టావో, కో స్యామ్యూయ్ దీవుల మధ్య ఆహ్లాదకరమైన ప్రయాణం గందరగోళంగా మారింది. డజన్ల కొద్దీ పర్యాటకుల బ్యాగులు, సూట్‌కేసులు ఫెర్రీ పైభాగం నుండి జారి నేరుగా లోతైన సముద్రంలో పడిపోయాయి. పర్యాటకులు తమ విలువైన వస్తువులు తమ కళ్ళ ముందు అలలపై తేలుతూ ఉండటం చూసి భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది ఈ నిర్లక్ష్య పనితో పర్యాటకుల భద్రత, థాయిలాండ్‌లోని ఫెర్రీ ఆపరేటర్ల బాధ్యత పట్ల ప్రజల్లో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి.

ఇవి కూడా చదవండి

కఠినమైన వాతావరణం, బలమైన అలల గుండా ఫెర్రీ ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, డెక్ ఉపరితలం తడిగా ఉంది. అక్కడ భద్రపరిచిన సామాను తాళ్లతో సరిగ్గా కట్టలేదు. పడవ అలలను బలంగా ఢీకొనడంతో అనేక సూట్‌కేసులు ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకుపోయాయి. ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు చెందిన పర్యాటకురాలు ఆలిస్ జాంపరెల్లి ఈ సంఘటనను మొత్తం రికార్డ్‌ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హుక్స్ ఉపయోగించి బ్యాగులను తిరిగి పొందడానికి సిబ్బంది విఫల ప్రయత్నం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా మంది పర్యాటకుల పాస్‌పోర్ట్‌లు, ముఖ్యమైన పత్రాలు, ప్రయాణ బీమా పత్రాలు కూడా కొట్టుకుపోయాయి. వారంతా విదేశీ దేశంలో చిక్కుకుపోయారు.

తమ సామాను పోయిన దానికంటే.. పర్యాటకులు ఫెర్రీ కంపెనీ వైఖరితో కలత చెందారు. ఆలిస్ జాంపరెల్లి ప్రకారం, నష్టాన్ని భర్తీ చేయడానికి వారు కంపెనీతో చాలాసేపు వాదించాల్సి వచ్చింది. ఈ సందర్బంగా ఆలిస్ మాట్లాడుతూ, ఫెర్రీ సిబ్బంది మా మాటలను సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. ఒక సూట్‌కేస్ ధర 20,000 భాట్ (సుమారు 55 వేల రూపాయలు) కంటే ఎక్కువ ఉండదని వారు భావించారు. అయితే మా బ్యాగుల్లో చాలా వస్తువులు ఉన్నాయని చెప్పారు. తీవ్ర ప్రయత్నం తర్వాత ఎల్లిస్ 50,000 థాయ్ బాట్ (సుమారు రూ.1.38 లక్షలు) పరిహారం అందుకున్నాడు. ఇది అతను నష్టాపోయినదాని కంటే చాలా తక్కువ. ఇతర ప్రయాణీకులకు తెలియకుండా ఉండటానికి కంపెనీ తనకు ఆ డబ్బును రహస్యంగా చెల్లించిందని ఎల్లిస్ పేర్కొన్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఎల్లిస్, అతని బృందం పోరాటం తర్వాత వారి డబ్బులో కొంత భాగాన్ని తిరిగి పొందగలిగారు, కానీ, పాపం చాలా మంది ఇతర ప్రయాణికులు దురదృష్టవంతులు. అందిన సమాచారం మేరకు చాలామందికి ఒక్క పైసా కూడా లేకుండా పోయింది. వారికి చాలా తక్కువ పరిహారం ఇవ్వబడింది. ఈ సంఘటన థాయిలాండ్ పర్యాటక పరిశ్రమకు ఆందోళన కలిగిస్తుంది. అనుకూల వాతావరణం లేదనే హెచ్చరికలు ఉన్నప్పటికీ సామాను సురక్షితంగా ఉంచడంలో విఫలమవడం తీవ్రమైన తప్పుగా ప్రజలు మండిపడుతున్నారు.

థాయిలాండ్ భారతీయ పర్యాటకులకు బాగా ప్రాచుర్యం పొందింది. కానీ, ఈ సంఘటన ఒక గుణ పాఠంగా పనిచేస్తుంది. మీ పర్యటనలో మీ విలువైన వస్తువులను, పత్రాలను చెక్-ఇన్ సామానులో లేదా ఓపెన్ డెక్‌లో ఎప్పుడూ ఉంచవద్దు. ఒక చిన్న అజాగ్రత్త బంగారు జ్ఞాపకాలను చేదు అనుభవాలుగా మారుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us