AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రరావు...

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Shiva Prajapati
|

Updated on: Nov 30, 2020 | 2:02 PM

Share

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రరావు, ఇంద్రసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఎన్నిక సంఘం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. గ్రేటర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా ఎన్నికల సంఘం అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రఘునందన్ రావు, రామచంద్రారావు, ఇంద్రసేనా రెడ్డి సహా ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసి తరలించారు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు నేడు ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

ఇదిలాఉండగా, ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ ఏదోలా రాద్దాంతం చేసి వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

Follow Us
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
అబ్బబ్బో.. వీటిని టేస్ట్ చేస్తే వదిలి పెట్టరు.. మీరు ట్రై చేయండి!
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచే మఖానా దోశలు.. ఎలా చేయాలంటే?
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
రక్తం ఇస్తే డబ్బులిచ్చే కుర్చీ..OTTలో భయపెడుతోన్న తెలుగు సినిమా
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
తేడాగా ఉందని ఆపి చెక్ చేశారు! లోపల స్పెషల్ రూమ్.. అందులో..
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో