కాఫీ షాప్‌లో పుట్టిన ప్రేమ.. సరిహద్దులు దాటుకుని భారత్‌కు చేరిన దక్షిణ కొరియా యువతి..

తమ ఇరువురి కుటుంబాల అనుమతితో 4 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుఖ్ జిత్ తెలిపారు. అయితే, కొడుకు,కోడలు ఇండియాలోనే ఉండాలని కోరుకుంది సుఖ్‌ జిత్‌ తల్లి. ఇది వారి జీవితం వారి ఇష్టమన్నారు. కానీ, వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ సుఖ్‌జిత్ తల్లి హర్జిందర్ కౌర్ కోరుకున్నారు.

కాఫీ షాప్‌లో పుట్టిన ప్రేమ.. సరిహద్దులు దాటుకుని భారత్‌కు చేరిన దక్షిణ కొరియా యువతి..
South Korean Woman
Follow us

|

Updated on: Aug 22, 2023 | 3:10 PM

సరిహద్దులు దాటిన ప్రేమకథలు ఇటీవల పెరుగుతున్నాయి. విదేశాల మధ్య ప్రేమకథలు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో వస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్ కు చెందిన అంజు ఇప్పటికే వార్తల్లో నిలిచారు. వీటన్నింటి మధ్య దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి ప్రియుడి కోసం భారత్‌కు వచ్చింది. భారతీయ మూలానికి చెందిన తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి దక్షిణ కొరియా నుండి ఓ యువతి భారతదేశానికి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సుఖ్‌జిత్ సింగ్ కొరియాలోని బుసాన్‌లోని ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిచేస్తున్న కిమ్ బోతో ప్రేమలో పడింది. వీరిద్దరూ నాలుగేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత సుఖ్‌జిత్‌ ఇటీవలే భారత్‌కు తిరిగొచ్చాడు. వచ్చిన 2 నెలల తర్వాత కిమ్ కూడా ఇండియా వచ్చాడు. ఈ జంట సిక్కు సంప్రదాయం ప్రకారం గురుద్వారాలో వివాహం చేసుకున్నారు. కిమ్ 3 నెలల వీసాపై భారతదేశానికి వచ్చారు. తాను తర్వాత బుసాన్ వెళతాను అని సుఖ్‌జిత్ చెప్పాడు.

కాఫీ షాప్‌లో పుట్టిన ప్రేమ.. భారత్‌కు వచ్చిన దక్షిణ కొరియా యువతి పంజాబీ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా పుయాన్‌లోని గురుద్వారా నానక్ బాగ్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఓ కాఫీ షాప్‌లో పనిచేస్తుండగా.. బిల్లింగ్ కౌంటర్‌లో పనిచేస్తున్న కిమ్ బోహ్‌ని(30)తో పరిచయం ఏర్పడింది. కొద్ది నెలల్లోనే కొరియన్ భాష నేర్చుకోవడం ద్వారా తనకు, బోహ్ నీకి మధ్య ఉన్న భాషా అవరోధాన్ని తాను అధిగమించానని సింగ్ చెప్పాడు. పెళ్లికి ముందు ఈ జంట నాలుగేళ్లు కలిసి జీవించారు. అయితే, ఇంతలో సుఖ్ జీత్ స్వస్థలానికి వెళ్లాడు. సుఖ్ జిత్ ఇంటికి వచ్చి ఆరు నెలలైంది.  అతడు లేకపోవడం తట్టుకోలేక విమానంలో బయల్దేరి ఢిల్లీ వచ్చేసింది ఆ యువతి. అక్కడి నుంచి నేరుగా షాజహాన్ పూర్ లోని సుఖ్ జీత్ ఇంటికి వెళ్లింది. కిమ్‌ని చూడగానే తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

South Korean Woman

‘కిమ్‌ మాట్లాడుతూ.. తాను నాలుగు నెలల్లో భాషా సమస్యను అధిగమించి కొరియన్‌ నేర్చుకున్నానని చెప్పాడు. తమ ఇరువురి కుటుంబాల అనుమతితో 4 ఏళ్ల పాటు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని సుఖ్ జిత్ తెలిపారు.

అయితే, కొడుకు,కోడలు ఇండియాలోనే ఉండాలని కోరుకుంది సుఖ్‌ జిత్‌ తల్లి. ఇది వారి జీవితం వారి ఇష్టమన్నారు. కానీ, వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను అంటూ సుఖ్‌జిత్ తల్లి హర్జిందర్ కౌర్ కోరుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..