AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వృద్ధుడికి దొరికిన కొండచిలువ పిల్ల.. ముద్దుగా ఉందని పెంచుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే?

కూరగాయలు అమ్ముకునే 60ఏళ్ల వృద్ధుడు కొండచిలువ దాడిలో మృతిచెందాడు. ఈ సంఘటన అనంతరం కొండచిలువ అదే ప్రాంతంలో అక్కడక్కడ తిరగడం కనిపించింది. పోలీసులు వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించటంతో అతను కొండచిలువను బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసు అధికారి తెలిపారు.

వృద్ధుడికి దొరికిన కొండచిలువ పిల్ల.. ముద్దుగా ఉందని పెంచుకున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే?
Python Killed Man
Jyothi Gadda
|

Updated on: Aug 30, 2024 | 11:43 AM

Share

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో హృదయ విదారకమైన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కూరగాయలు అమ్ముకునే 60ఏళ్ల వృద్ధుడు కొండచిలువ దాడిలో మృతిచెందాడు. స్థానికంగా కూరగాయలు అమ్ముకునే వ్యక్తికి ఒకరోజు చిన్ని కొండచిలువ పాము కనిపించింది. దాంతో అతను దాన్ని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవటం మొదలుపెట్టాడు. అతడు తరచూ ఆ కొండచిలువను మెడకు చుట్టుకుని ఆడించేవాడు. చుట్టుపక్కల ప్రజలు ఇదంతా చూసి ఆనందపడేవారు. ఒకింత ఆశ్చర్యపోయేవారు. అంతేకాదు.. అతనికి డబ్బులు కూడా ఇచ్చేవారు. దీంతో అతను కూడా పామును ఆడిస్తూ ఈజీగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశపడ్డాడు. ఈ క్రమంలోనే ఒకరోజు పామును ఆడిస్తుండగా, అది అతని మెడను గట్టిగా చుట్టేసింది. అతను నొప్పి, బాధతో అల్లాడిపోయాడు. చివరకు ఆ కొండచిలువ అతని గొంతును గట్టిగా చుట్టుకుని నులిమేసింది. దాంతో ఆ వ్యక్తి ఊపిరాడక చనిపోయాడు.

ఈ విషాద సంఘటన ఆగస్టు 29 గురువారం రోజున జరిగింది. పామును ఆడిస్తూ.. డబ్బు సంపాదించవచ్చని భావించిన అతను.. రోడ్డుపై దొరికిన కొండచిలువ పిల్లను తన వెంట తెచ్చుకున్న పాపానికి అదే అతని మరణానికి కారణమైంది. ఈ విషాద ఘటన వార్త విన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవించే 60 ఏళ్ల వృద్ధుడు కొండచిలువను పెంచుకున్నాడు. చివరకు దానికే బలైపోవడంతో స్థానికులు సైతం కన్నీరు పెట్టుకున్నారు. జరిగిన ఘటనపై స్థానికులే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మామిడి ప్రాంతంలోని దిమ్నా రోడ్డులో నివసిస్తున్న మృతుడు హేమంత్ సింగ్‌ అని చెప్పారు.. ఈ సంఘటన అనంతరం కొండచిలువ అదే ప్రాంతంలో అక్కడక్కడ తిరగడం కనిపించింది. పోలీసులు వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించటంతో అతను కొండచిలువను బంధించి అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసు అధికారి తెలిపారు. మృతుడు హేమంత్‌ సింగ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు మామిడి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి నిరంజన్‌కుమార్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..