Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakhi Festival 2024: ఈ గ్రామంలో 832 ఏళ్లుగా రాఖీ పండగను జరుపుకోరు.. కారణం తెలిస్తే కన్నీరు ఆగదు..

ఆ గ్రామ ప్రజలు రాఖీ పండగ రోజుని సంతోషంగా జరుపుకోరు... అందుకు బదులుగా వీరు దీనిని చెడ్డ శకునంగా భావిస్తారు. ఎందుకు కాదంటే దీని వెనుక 832 ఏళ్ల నాటి విషాద కథ ఉంది. ఆ సమయంలో ఢిల్లీలో పృథ్వీరాజ్ చౌహాన్ హత్య తర్వాత మహమ్మద్ ఘోరీ సైనికులు సురానా గ్రామం మొత్తాన్ని చుట్టుముట్టారు. ఆ గ్రామంలోని పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ వెదికి మరీ వేటాడి వధించారు.

Rakhi Festival 2024: ఈ గ్రామంలో 832 ఏళ్లుగా రాఖీ పండగను జరుపుకోరు.. కారణం తెలిస్తే కన్నీరు ఆగదు..
No Rakhi Celebrations
Follow us
Surya Kala

|

Updated on: Aug 20, 2024 | 11:58 AM

హిందువులు ఘనంగా రాఖీ పండగ ను జరుపుకున్నారు. అన్నా చెల్లెలు.. అక్కా తమ్ముళ్ళు రక్షణ కోరుతూ రక్షను కట్టారు. అయితే సోదరసోదరీమణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ రాఖీ పండగను దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లోని ఒక గ్రామస్తులు మాత్రం జరుపుకోరు. పైగా ఆ గ్రామస్తులు రాఖీ పండగను విషాద ఘటనకు చిహ్నంగా భావిస్తారు. సురానా గ్రామంలో గత 832 ఏళ్లుగా రక్షాబంధన్‌ను జరుపుకోవడం లేదు. నేటికీ ఈ పండుగ వచ్చిందంటే చాలు ఆ గ్రామంలోని అక్కచెల్లెళ్ల కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఎవరికైనా

సైనికులు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామంలో ఒక్క సోదరుడు కూడా సజీవంగా లేడు. రాఖీ పండగ సందర్భంలో అలాంటి విషాద ఘటనను నేటికీ కొంతమంది గుర్తు చేసుకుంటారు. ఈ సంఘటన 1192వ సంవత్సరం నాటిది. తరైన్ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో మహమ్మద్ ఘోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణించాడు. దీనితో ముస్లిం ఆక్రమణదారులు అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించారు. ఈ యుద్ధంలో యదువంశీ వీరులు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ తరపున పోరాడారు. అయితే యుద్ధంలో ఓటమి తరువాత యదువంశ వీరులు ఘజియాబాద్‌లోని మోడీనగర్‌కు ఆనుకుని ఉన్న సురానా గ్రామంలో ఆశ్రయం పొందారు.

గ్రామంలో మారణహోమం సృష్టించిన ఘోరీ

ఇవి కూడా చదవండి

ఘోరీకి ఈ వార్త తెలియగానే అతను మొత్తం సైనిక బృందాన్ని పంపించాడు. ఆ సైన్యం ఈ గ్రామాన్ని చుట్టుముట్టాడు. దీని తరువాత పిల్లల నుండి వృద్ధుల వరకు గ్రామంలో కనిపించే ప్రతి మగవారిని హత్య చేశారు. ఘోరీ సైనికుల సృష్టించిన మారణ హోమం తర్వాత ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా సజీవంగా లేడు. ఆ రోజు రాఖీ పండగ. అప్పటి నుంచి ఈ గ్రామంలో రక్షాబంధన్ పండగను చెడ్డ శకునంగా పరిగణించడం ప్రారంభమైంది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ నేటికీ ఈ గ్రామంలో నివసించే ఏ సోదరీ సోదరుడికి రాఖీ కట్టదు.

అన్నా చెల్లల పండగను ఘనంగా జరుపుకునే గ్రామం

రాఖీ పండగ రోజున గ్రామం శోకసంద్రంలో మునిగిపోయినా.. భాయ్ దూజ్ పండుగ సంబరాలు మాత్రం మిన్నంటుతాయి. సోదర సోదరీమణుల పండుగ అయిన అన్నాచెల్లెళ్ళ పండగను ఈ గ్రామంలోని సోదరసోదరీమణులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సోదరులు తమ సోదరీమణుల కోసం ఎన్నో బహుమతులను ఇస్తారు. అదే సమయంలో సోదరీమణులు కూడా తమ సోదరులకు హారతి ఇచ్చి తమ అన్నదమ్ముల క్షేమం కోసం ప్రార్థిస్తారు. తమను తాము రక్షించుకుంటామని ప్రమాణం కూడా చేస్తారు.

ఇదీ ఆ గ్రామ చరిత్ర

మోడీ నగర్‌లోని సురానా గ్రామం ఛబ్రియా గోత్రానికి చెందిన యదువంశీయులకు చెందినది. ఇక్కడ స్థిరపడిన అహిర్ కమ్యూనిటీ ప్రజలు నిజానికి అల్వార్ నివాసితులు. ఈ ప్రజలు స్వతహాగా సైనికులు, 11వ శతాబ్దం ప్రారంభంలో అల్వార్ నుండి వలస వచ్చి ఘజియాబాద్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింధు నది ఒడ్డున స్థిరపడ్డారు. ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజలు వందకు పైగా యుద్ధాలు చేసి అన్ని యుద్ధాలలో విజయం సాధించారు. అందుకే ఈ ప్రదేశానికి సౌ-రానా అని పేరు పెట్టాడు. ఈ పేరు కాల క్రమంలో సురానగా మారింది. నేడు ఈ గ్రామాన్ని సురానా అనే పేరుతో పిలుస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..