AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నాడు.. 3 నెలలు పార్టీలే పార్టీలు.. కట్‌ చేస్తే.. చావు అంచుకు చేరాడు..

కోట్ల రూపాయల లాటరీ గెలిచిన వ్యక్తి ఆనందానికి అవధులు లేవు. డబ్బు చేతికి రాగానే ఉద్యోగం మానేశాడు.. తనకు ఇష్టమైనది తిన్నాడు.. నచ్చిన పని చేశాడు.. చేయాలనుకున్నవన్నీ ఎంజాయ్ చేశాడు..విచ్చలవిడిగా పార్టీలతో రెచ్చిపోయాడు..కానీ, పాపం అతని సంతోషం ఎంతో కాలం నిలువలేదు.. అతని జీవితంలో జరిగిన ఈ గందరగోళం భయంకరమైన మలుపు తిరిగింది..కట్‌ చేస్తే ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే..

కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నాడు.. 3 నెలలు పార్టీలే పార్టీలు.. కట్‌ చేస్తే.. చావు అంచుకు చేరాడు..
Lottery Winner Adam
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2025 | 4:03 PM

Share

ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు..ప్రజల జీవితాలను మార్చేది కూడా డబ్బే.. మనిషికి ప్రాణం పోయేలన్న, చనిపోయిన మనిషిని తగలేయాలన్న డబ్బు కావాల్సిందే. మనిషి ప్రతి మార్పుకు నాంది డబ్బు.. ఇది అక్షర సత్యం అని నిరూపిస్తూ ఒక వ్యక్తి జీవితంలో డబ్బు తెచ్చిన మార్పు అతనికి ప్రాణాంతకంగా మారింది. 39 ఏళ్ల నార్విచ్ నివాసి ఆడమ్ లోపెజ్ మూడు నెలల క్రితం లాటరీ స్క్రాచ్‌కార్డ్‌లో £1 మిలియన్ (సుమారు ₹119 మిలియన్లు) గెలుచుకున్నాడు. దాంతో తన ఉద్యోగాన్ని వదిలివేసి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం మొదలుపెట్టాడు. ప్రతినిత్యం విందులు, వినోదాలతో ఎంజాయ్‌ చేయసాగాడు. అతడు గత జూలైలో లాటరీ గెలిచిన తర్వాత అతని జీవితం రోలర్‌కోస్టర్ గా మారిందని అతనే ఒప్పుకున్నాడు. అప్పుడు అతని బ్యాంక్ బ్యాలెన్స్ రూ.12.40 నుండి రూ.119 మిలియన్లకు పెరిగింది అని ఆడమ్ అన్నాడు. కానీ, ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అతని జల్సాలు అతన్ని నాశనం చేశాయి. అతను చేసిన విచ్చలవిడి ఎంజాయ్‌మెంట్‌ అతని జీవితంపై వినాశకరమైన తుఫానును తెచ్చిపెట్టింది. మూడు నెలల్లోనే అతని జీవితం తలక్రిందులుగా మారిపోయింది.

ఈ సంఘటన సెప్టెంబర్ 10న జరిగింది. అతని పరిస్థితి విషమించడం చూసి, వెంటనే అంబులెన్స్‌లో నార్ఫోక్, నార్విచ్ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనికి ద్విపార్శ్వ పల్మనరీ ఎంబోలిజం ఉన్నట్లు నిర్ధారించారు. అంటే అతని కాలులో రక్తం గడ్డకట్టడం అతని ఊపిరితిత్తులకు వ్యాపించింది. ఇది విని ఆడమ్ షాక్ అయ్యాడు. అతను ఇలా అన్నాడు.. తాను చేస్తున్న పని వల్ల తన ఆరోగ్యం పాడైవుతుందని నాకు తెలుసు, కానీ ఇంత భయంకరమైన రీతిలో.. ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదు అంటూ బోరుమన్నాడు. ఇది నాకు పెద్ద గుణపాఠం, మేల్కొలుపు వంటిది అన్నాడు. సుమారు £120 మిలియన్ల లాటరీ విజయంతో తాను ఎన్నడూ జీవించని జీవితాన్ని గడపడానికి అవకాశం ఇచ్చిందని ఆడమ్ ఒప్పుకున్నాడు. కానీ, అతను తప్పుడు మార్గంలో వెళ్ళానని ఒప్పుకున్నాడు.

తీవ్ర అనారోగ్యంతో అతడు ఎనిమిదిన్నర రోజులు ఆసుపత్రిలో గడిపిన తర్వాత, అతను తన భయంకరమైన అనుభవాన్ని వివరించాడు. తాను నడవలేకపోయానని, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారిందని చెప్పాడు. తాను అంబులెన్స్‌లో పడుకుని సైరన్‌లు విన్నప్పుడు, ఇది నా జీవితంలో అత్యంత పరివర్తన కలిగించే క్షణం అని నేను గ్రహించాను అంటూ చెప్పాడు. ఇంత కష్టకాలం గడిచిన తర్వాత తన ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు మీ దగ్గర 120 మిలియన్ రూపాయలు ఉన్నాయా లేదంటే, 1200 మిలియన్ రూపాయలు ఉన్నాయా అనేది పట్టింపు కాదు అని అన్నాడు. ఆడమ్ ఇప్పుడు తన ఉద్యోగాన్ని వదిలేసినందుకు చింతిస్తున్నాడు..ఇప్పుడు అతను తన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాడు.. జూలైలో స్క్రాచ్ కార్డ్ కొని దాదాపు 120 మిలియన్ రూపాయలు గెలుచుకున్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని ఆడమ్ చెప్పాడు. నేషనల్ లాటరీ తన విజయాన్ని నిర్ధారించినప్పుడు అతని తల్లి డానికా చాలా సంతోషించిందని చెప్పాడు. కానీ,తాను అదృష్టాన్ని ఇలాంటి దురదృష్టంగా మార్చుకునాన్నంటూ వాపోయాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..