AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? 99 శాతం మందికి తెలియని రహస్యం.. అడుగు పెడితే గూస్‌బంప్స్..!

Last Road of India: దేశంలోనే అత్యంత సుందరమైన, అదే సమయంలో భయంకరమైన చరిత్ర కలిగిన ఆఖరి సరిహద్దు రోడ్డు గురించి మీకు తెలుసా? రామాయణ కాలం నాటి పౌరాణిక మూలాలు, దయ్యాల పట్టణంగా మారిన విషాద గాథ, ఇరువైపులా అనంతమైన సముద్రాల నడుమ సాగే అద్భుత ప్రయాణం.. ఇవన్నీ కలగలసిన ఆ రహదారి విశేషాలు కచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి!

భారతదేశపు చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? 99 శాతం మందికి తెలియని రహస్యం.. అడుగు పెడితే గూస్‌బంప్స్..!
Last Road Of India
Venkata Chari
|

Updated on: Aug 05, 2026 | 8:06 AM

Share

Last Road of India: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనుష్కోడిలోనే ‘భారతదేశపు చివరి రోడ్డు’ ఉంది. శ్రీలంకకు అత్యంత సమీపంలో ఉండే ఈ చిన్న తీరప్రాంత పట్టణం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకం. ఇక్కడికి వెళ్లే ఇరుకైన రహదారికి రెండు వైపులా పరుచుకున్న నీలిరంగు సముద్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. స్వచ్ఛమైన తీరాలు, వేగంగా వీచేగాలులు, కంటికి కనిపించినంత మేర అలల సవ్వడులు ప్రతి ఒక్కరికీ మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.

శ్రీరాముడి బాణం నుంచి పుట్టిన పవిత్ర భూమి..

ధనుష్కోడి అనగానే ప్రతీ ఒక్కరికీ రామాయణం గుర్తొస్తుంది. హిందూ పురాణాల ప్రకారం, రావణాసురుడి చెర నుంచి సీతాదేవిని విడిపించేందుకు శ్రీరాముడు తన వానర సేనతో కలిసి ఇక్కడి నుంచే రామసేతును నిర్మించాడని నమ్ముతారు. యుద్ధం ముగిసిన తర్వాత తన ధనుస్సు కొనతో ఆ వారధిని ధ్వంసం చేసిన ప్రదేశం కావడం వల్లే దీనికి “ధనుష్కోడి” అనే పేరు వచ్చింది. ధనుస్సు అంటే విల్లు, కోడి అంటే చివర అని అర్థం. ఈ కారణంతోనే ధనుష్కోడి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతోంది.

ఇది కూడా చదవండి: ఒకటో రెండో కాదు.. ఏకంగా 97 నదులు పారే ఏకైక జిల్లా.. ఎక్కడో కాదు మనదేశంలోనే..?

ఇవి కూడా చదవండి

ఒక్క రాత్రిలో శ్మశానంగా మారిన పట్టణం.. దయ్యాల నగరం గాథ..!

ఈ ఊరి చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటన 1964 డిసెంబర్ 22 రాత్రి జరిగింది. భారత్‌ను వణికించిన అత్యంత ఘోరమైన తుఫాను ధనుష్కోడిని పూర్తిగా తుడిచిపెట్టేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, రైల్వే స్టేషన్, చర్చి, భారీ భవనాలు సముద్రంలో కలిసిపోయాయి. ఈ ఘోర విపత్తు తర్వాత ధనుష్కోడి మనుషులు నివసించడానికి వీలులేని ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ ప్రాంతాన్ని “దయ్యాల పట్టణం” అని పిలుస్తున్నారు. నాటి బీభత్సానికి గుర్తుగా శిథిలమైన చర్చి, పాడుబడిన రైల్వే స్టేషన్ నిర్మాణాలు నేటికీ ఇక్కడ కనిపిస్తాయి. అయితే ఆ భయంకరమైన తుఫానును సైతం తట్టుకుని నిలబడిన కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు.

బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాల కలయిక..!

ధనుష్కోడిలోని అరైచల్ మునై ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడే బంగాళాఖాతం, మన్నార్ సింధుశాఖ, హిందూ మహాసముద్రాలు సంగమిస్తాయి. ఈ ప్రాంతానికి వెళ్లే రహదారి ఇరువైపులా మెరిసే నీలిరంగు నీరు పర్యాటకులకు అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. నేరుగా పడవల ప్రయాణం లేకపోయినా, ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం, పౌరాణిక నేపథ్యం, ప్రకృతి అందాల కారణంగా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.

ఇది కూడా చదవండి: హోటల్ గదిలో మంచం ముందు అద్దం ఎందుకు పెడతారో తెలుసా..? ఆ రహస్యం తెలిస్తే నోరెళ్లబెడతారు..!

ప్రకృతి వైపరీత్యానికి నెత్తురోడిన చరిత్ర ఉన్నప్పటికీ, ధనుష్కోడి నేటికీ తన ఆకర్షణను కోల్పోలేదు. పౌరాణిక ప్రాశస్త్యం, సముద్రపు సౌందర్యం మేళవించిన ఈ ప్రాంతం ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అద్భుత ప్రదేశం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us