AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి శ్రావణమాసం సారె

శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గ్రామదేవత పైడిమారమ్మ అమ్మవారికి గ్రామస్థులు అత్యంత వైభవంగా 108 రకాల పిండి వంటలతో శ్రావణ సారెను సమర్పించారు. గ్రామంలోని దూళికేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన సారె ఊరేగింపు మేళతాళాలు, భక్తుల నామస్మరణల నడుమ కోలాహలంగా సాగి అమ్మవారి ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

108 రకాల పిండి వంటలతో కురుపాం పైడిమారమ్మ అమ్మవారికి శ్రావణమాసం సారె
Kurupam Pydimaramma Temple
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Aug 24, 2026 | 8:37 PM

Share

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో శ్రావణ మాసం సందర్భంగా గ్రామదేవత పైడిమారమ్మకి గ్రామస్థులు ఘనంగా శ్రావణమాస సారెను సమర్పించారు. సుమారు 108 రకాల వంటకాలతో ప్రత్యేకంగా తయారుచేసిన సారేను ఊరేగింపుగా కురుపాంలోని దూళికేశ్వరస్వామి ఆలయం నుంచి మేళతాళాల నడుమ అమ్మవారి ఆలయానికి తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. పిండి వంటకాలతో పాటు చీరలు, పండ్లు, పసుపు, కుంకుమ తదితర పూజా సామగ్రిని సారెలో భాగంగా తీసుకొచ్చారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా కలగాలని, కుటుంబాల్లో సౌభాగ్యం వెల్లివిరియాలని అమ్మవారిని ప్రార్థించారు. శ్రావణ మాసంలో గ్రామదేవతకు సారె సమర్పించడం తమ ప్రాంతంలో కొనసాగుతున్న సంప్రదాయమని గ్రామస్థులు తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. 108 రకాల పిండి వంటలను భక్తితో తయారు చేసి అమ్మవారికి సమర్పించడం ద్వారా తమ కుటుంబాలతో పాటు గ్రామం మొత్తం అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.

సారె సమర్పణ కార్యక్రమంలో మహిళలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేళతాళాల నడుమ సాగిన ఊరేగింపు, అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలతో కురుపాం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తుల నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. కార్యక్రమం అనంతరం భక్తులకు నైవేద్య ప్రసాదాన్ని పంపిణీ చేశారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ సారె సమర్పణ కార్యక్రమం గ్రామ ప్రజల భక్తి, ఐక్యతతో పాటు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us