ఈ దోశను టేస్ట్‌ చేయాలంటే నిజంగా అది సాహసమే..! నెటిజన్స్‌ రియాక్షన్‌ చూడాలి మరీ..

కొత్త వింత వంటకం ఒకటి సోషల్ మీడియా వేదికగా ఊరిస్తోంది. కానీ, ఆ కాంబినేషన్‌ చూశాక మీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేం..

ఈ దోశను టేస్ట్‌ చేయాలంటే నిజంగా అది సాహసమే..! నెటిజన్స్‌ రియాక్షన్‌ చూడాలి మరీ..
Dosa
Follow us

|

Updated on: Oct 17, 2022 | 8:15 PM

సోషల్ మీడియాలో పాపులర్‌ కావటం కోసం చాలా మంది చిత్ర విచిత్రమైన పనులు చేస్తుంటారు. కొత్త కొత్త వంటకాలు,.. వింత వింత రుచులను నెటిజన్లకు పరిచయం చేస్తున్నారు. డార్క్‌ చాక్లెట్‌ విత్‌ మ్యాగీ, గులాబ్‌ జామూన్‌తో పానీపూరి ఇలాంటి వెరైటీ వంటకాలను నెట్టింట కలకలం సృష్టించాయి. అయితే, తాజాగా మరో కొత్త వింత వంటకం ఒకటి సోషల్ మీడియా వేదికగా ఊరిస్తోంది. కానీ, ఆ కాంబినేషన్‌ చూశాక మీ రియాక్షన్‌ ఎలా ఉంటుందో మాత్రం ఖచ్చితంగా చెప్పలేమండోయ్..

ఇకపోతే, తాజాగా ఓ ఫుడ్‌ బ్లాగర్‌ అంజనీ ధింగ్రా వెరైటీ కాంబినేషన్‌ అంటూ నూడుల్స్‌ను స్టఫ్‌ చేసిన ప్లెయిన్‌ దోశ డిష్‌ను ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేశారు. కొరియన్‌ ఫ్యూజన్‌ దోశ క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో వీడియోను పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Anjali Dhingra (@sooosaute)

పాన్‌పై దోశ పిండిని వేసిన తర్వాత అంజలి దానిపై కొరియన్‌ నూడుల్స్‌ను కుక్‌ చేసి వాటిని దోశలో స్టఫ్‌ చేశారు. ఆపై దాన్ని టేస్ట్‌ చేస్తూ వీడియోలో కనిపించారు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దోశ సరిగ్గా రాలేదని..లోపల పిండి కనిపిస్తోందని ఓ యూజర్‌ రాసుకొచ్చారు. ఈ వీడియోను ఇప్పటికైనా డిలీట్‌ చేయడం తొందరపాటు కాదంటూ మరో యూజర్‌ మండిపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి