వీడి రీల్స్‌ పిచ్చి తగలెయ్య..! లైకుల కోసం లైవ్‌లోనే ఏడు వోడ్కా బాటిళ్లు గటగటా తాగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో పలు పోస్ట్‌లను షేర్‌ చేసేవాడు. అలాంటి పోస్టుల కారణంగా అతడు అతను చాలాసార్లు యాప్ నుండి నిషేధించబడ్డాడు కూడా. అయితే అతను కొత్త కొత్త ఖాతాల ద్వారా ఆ నిషేధాన్ని దాటుకుని ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్టుగా సంబంధిత సంస్థ వెల్లడించింది.

వీడి రీల్స్‌ పిచ్చి తగలెయ్య..! లైకుల కోసం లైవ్‌లోనే ఏడు వోడ్కా బాటిళ్లు గటగటా తాగేశాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Chinese Spirit Baijiu
Follow us

|

Updated on: May 30, 2023 | 4:24 PM

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. వ్యూస్‌, లైకుల కోసం వింత వింత రీల్స్ చేయటం నేటి యువతలో అలవాటుగా మారింది. దానికోసం ఏమైనా చేసే స్థాయికి చేరుకుంది యువత. ఈ క్రమంలోనే పలువురు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. అలాంటి విషాద ఘటనే మరోకటి వెలుగులోకి వచ్చింది. రీల్స్‌ పిచ్చి “సంకియాంగే” అనే 34 ఏళ్ల వ్యక్తి మరణానికి దారి తీసింది. 34 ఏళ్ల సంకియాంగే, “చైనీస్ వోడ్కా” అని పిలిచే ఏడు బాటిళ్ల బైజియు తాగాడు. అది గాయాలను మాన్పించే స్పిరిట్‌గా తెలిసింది. సాంకియాంగే సోషల్ మీడియాలో డ్రింకింగ్ ఛాలెంజ్ అంటూ తాగడం మొదలుపెట్టాడు. మే 16న తెల్లవారుజామున ఒంటిగంటకు అతడు తన లైవ్ స్ట్రీమింగ్లో ఛాలెంజ్‌ని ప్రారంభించాడు. అతను ఎంత తాగాడో అతనికే తెలియనంతగా తాగేశాడు.

బైజియులో ఆల్కహాల్ కంటెంట్ 30% నుండి 60% వరకు ఉంటుంది. అయితే, ఈ వీడియో ప్రత్యక్ష ప్రసారం చేసిన 12 గంటల తర్వాత సాంకియాంగే చనిపోయినట్లు తెలిసింది. అతను అధిక మోతాదులో ఆల్కహాల్‌ తీసుకోవటం వల్లే చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. కాగా, చైనా సోషల్ మీడియా యాప్‌లో శాంక్యో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్‌లో గెలిచిన వారికి బహుమతులు, ఓడిపోయిన వారికి శిక్షలు వ్యూయర్స్‌తో నిర్ణయిస్తారని ప్రకటించారు.

ఇకపోతే, సాంకియాంగే ఇంతకు ముందు కూడా మద్యం మత్తులో పలు పోస్ట్‌లను షేర్‌ చేసేవాడు. అలాంటి పోస్టుల కారణంగా అతడు అతను చాలాసార్లు యాప్ నుండి నిషేధించబడ్డాడు కూడా. అయితే అతను కొత్త కొత్త ఖాతాల ద్వారా ఆ నిషేధాన్ని దాటుకుని ఇప్పుడు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నట్టుగా సంబంధిత సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..