AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: కూతురి ఆపరేషన్ ‌కోసం విదేశాలకు వెళ్లిన ఆనంద్ మహీంద్రా..! అదే నాకు గుణపాఠం అంటూ కీలక వ్యాఖ్యలు..

ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా వీడియోలో వివరించారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా @hvgoenka X (ట్విట్టర్) ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే ఈ వీడియోకు 'నా స్నేహితుడు చెప్పిన అందమైన కథ' అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Anand Mahindra: కూతురి ఆపరేషన్ ‌కోసం విదేశాలకు వెళ్లిన ఆనంద్ మహీంద్రా..! అదే నాకు గుణపాఠం అంటూ కీలక వ్యాఖ్యలు..
Anand Mahindra
Jyothi Gadda
|

Updated on: Mar 21, 2024 | 7:02 PM

Share

ప్రసిద్ధ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఎల్లప్పుడూ జుగాడ్‌ వీడియోలు లేదా అనేక స్ఫూర్తిదాయకమైన వీడియోలను షేర్‌ చేస్తుంటారు. కానీ, ఈరోజు ఆయన తన వ్యక్తిగత జీవితంలో జరిగిన మనసుకు హత్తుకునే కథను చెబుతూ వినియోగదారులకు సందేశం ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారక ఉపన్యాసానికి ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఆ సమయంలో ఆనంద్ మహీంద్రా తన చిన్న కూతురు చేతికి గాయమైందని చెప్పి చికిత్స కోసం వివిధ దేశాలకు వెళ్లానని, అతను ఆ క్షణం జ్ఞాపకాన్ని వినియోగదారులతో పంచుకున్నాడు. ప్రతిదీ ఎలా పరిష్కరించవచ్చో చెప్పాడు.

ఆనంద్ మహీంద్రా తన కుమార్తె చేతికి గాజు తగిలి గాయం కావడంతో మైక్రో సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అందుకోసం తన కూతుర్ని పారిస్, లండన్ లలోని ప్రముఖ సర్జన్లు చికిత్స అందించినప్పటికీ సరైన వైద్యం అందలేదని చెప్పాడు. కానీ, తన కుమార్తెకు ముంబైలో డాక్టర్ జోషి చికిత్స అందించారని చెప్పారు.. డాక్టర్ జోషి తన కూతురి వేలిలో ఒక సాధారణ మెటల్ ఐ హుక్‌ని అమర్చారు. ఈ పరికరం ధర కేవలం రెండు రూపాయలు మాత్రమేనని ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. డాక్టర్ జోషి ఐ హుక్‌ని ఉపయోగించి తన కుమార్తె వేలిని ఎలా కదిలించాడో వివరించాడు. కొంత సమయం తర్వాత తన కూతురు అదే చేత్తో పియానో ​​వాయించడం ప్రారంభించిందని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ఈ కథను మళ్లీ చెప్పడానికి కారణం ఈ సంఘటన నాకు గుణపాఠం నేర్పిందన్నారు ఆనంద్ మహీంద్రా. ఎదురైన సవాళ్లకు ఎక్కడెక్కడో పరిష్కారాలను వెతకడానికి ముందు, మీ సొంత తెలివి తేటలను ఉపయోగించి పరిష్కారాలను చూడండి. ఒక్క మాటలో చెప్పాలంటే విదేశాల్లో లెక్కకు చికిత్స చేయడానికి ఉత్తమ ప్రత్యామ్నాయం ఉన్నప్పటికీ, ముంబైలోని డాక్టర్ జోషి ఉపాయం ఆనంద్ మహీంద్రా కూతురి చికిత్సకు ప్రయోజనం చేకూర్చింది. ఈ విషయాన్ని ఆనంద్ మహీంద్రా వీడియోలో వివరించారు. ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా @hvgoenka యొక్క X (ట్విట్టర్) ఖాతా ద్వారా సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. అలాగే ఈ వీడియోకు ‘నా స్నేహితుడు చెప్పిన అందమైన కథ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..