టిక్‌టాక్‌లో ప్రేమ.. ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలతో సరిహద్దులు దాటిన దిల్రూబా.. ట్విస్ట్‌ ఏంటంటే..

టిక్‌టాక్‌లో పరిచయం ద్వారా వీరి ప్రేమకథ మొదలైంది. దాంతో ఆ మహిళ తన పిల్లలతో కలిసి బంగ్లాదేశ్ నుండి తన ప్రేమికుడిని కలవడానికి యూపీకి చేరుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి దిల్రూబా షర్మి ప్రేమించిన ప్రియుడి కోసం యూపీలోని శ్రావస్తికి చేరుకుంది. తీరా ప్రియుడి ఇంటికి చేరిన ఆ మహిళకు ఊహించని షాక్‌ తగిలింది.

టిక్‌టాక్‌లో ప్రేమ.. ప్రియుడి కోసం ముగ్గురు పిల్లలతో సరిహద్దులు దాటిన దిల్రూబా.. ట్విస్ట్‌ ఏంటంటే..
Tik Tok Love Story
Follow us

|

Updated on: Oct 02, 2023 | 10:09 AM

పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ ల ప్రేమకథ భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్‌లో కూడా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు యూపీలోని శ్రావస్తిలో ఇలాంటి కేసు మరొకటి వెలుగులోకి వచ్చింది. టిక్‌టాక్‌లో పరిచయం ద్వారా వీరి ప్రేమకథ మొదలైంది. దాంతో ఆ మహిళ తన పిల్లలతో కలిసి బంగ్లాదేశ్ నుండి తన ప్రేమికుడిని కలవడానికి యూపీకి చేరుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పిల్లల తల్లి దిల్రూబా షర్మి ప్రేమించిన ప్రియుడి కోసం యూపీలోని శ్రావస్తికి చేరుకుంది. తీరా ప్రియుడి ఇంటికి చేరిన ఆ మహిళకు ఊహించని షాక్‌ తగిలింది. ప్రియురాలు తన ప్రియుడి ఇంటికి చేరుకోగానే ప్రియుడి భార్య, కుటుంబ సభ్యులు ఆమెను వ్యతిరేకించారు.. దీంతో పెద్ద దుమారమే రేగింది. విషయం పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. పోలీసుల జోక్యంతో ఆ ముగ్గురు పిల్లల తల్లి చివరకు తన దేశం బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లడానికి లక్నోకు బయలుదేరింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ వీసా చెల్లుబాటు కావడంతో ఆమెను వెళ్లేందుకు అనుమతించారు.

టిక్‌టాక్‌లో మొదలైన ప్రేమ ..

నిజానికి, భారతదేశం-నేపాల్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న శ్రావస్తిలో ఒక గ్రామం ఉంది. దీని పేరు భర్త రోషన్‌గఢ్. ఇక్కడ నివసించే అబ్దుల్ కరీం బుహ్రాన్ బేకరీ ఇంట్లో పనిచేసేవాడు. ఈ సమయంలో, అబ్దుల్ కరీమ్‌కు సమయం దొరికినప్పుడల్లా అతను టిక్‌టాక్‌లో టైమ్ పాస్ చేసేవాడు. ఈ సమయంలోనే అబ్దుల్ కరీం టిక్‌టాక్‌లో దిల్రూబా శర్మ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దిల్రూబా షర్మి బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లోని రౌజన్ నివాసి. దిల్రూబా షర్మి భర్త కోవిడ్ సమయంలో మరణించాడు. కరీమ్, దిల్రూబా స్నేహితులుగా మారారు. క్రమంగా వారి సాన్నిహిత్యం ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగేవి. ఈ సమయంలో అబ్దుల్ కరీం బోహరన్ నుంచి శ్రావస్తిలోని తన ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే సీమా మాదిరిగానే.. దిల్రూబా శర్మ కూడా తన కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి తన ప్రేమికుడిని కలవడానికి బంగ్లాదేశ్ నుండి పర్యాటక వీసాపై శ్రావస్తికి చేరుకుంది. సెప్టెంబరు 26న తొలుత కోల్‌కతా చేరుకుని అక్కడి నుంచి లక్నోకు వచ్చింది. అక్కడ్నుంచి ఆమె బస్సులో బహ్రైచ్‌కు వచ్చింది. సమాచారం ప్రకారం, మహిళ దిల్రుబా షర్మి బహ్రైచ్‌లోని ఒక హోటల్‌లో రెండు రోజులు బస చేసింది.

ఇవి కూడా చదవండి

దీని తర్వాత, తన ప్రేమికుడి ఇంటిని ఎలాగోలా తెలుసుకుంది..ఎట్టకేలకు ఆమె శ్రావస్తిలోని అబ్దుల్ కరీం ఇంటికి చేరుకుంది. అయితే, అప్పటికే అతడికి పెళ్లైంది. ఒక పా కూడా ఉంది. అబ్దుల్ కరీం భార్య, కుటుంబ సభ్యులు దిల్రూబా శర్మను అడ్డుకున్నారు. మహిళ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దిల్రూబా శర్మ, అబ్దుల్ కరీమ్‌లను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ చాలా సేపు ఇద్దరికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు పోలీసులు. చివరికి దిల్రూబా శర్మ తన పిల్లలతో కలిసి బంగ్లాదేశ్‌లోని తన ఇంటికి తిరిగి వెళ్లడానికి శ్రావస్తి నుండి లక్నోకు బయలుదేరింది.

అయితే, టిక్‌టాక్‌ ద్వారా పరిచయమైన అబ్దుల్ కరీం తనకు ఇంకా పెళ్లి కాలేదని, తాను బ్రహ్మచారిగా చెప్పుకున్నాడని పోలీసులకు చెప్పింది. ఈ కారణంగానే దిల్రూబా షర్మి తన ముగ్గురు పిల్లలతో బంగ్లాదేశ్ నుండి శ్రావస్తికి వచ్చానని చెప్పింది. ఇక్కడి వచ్చిన తర్వాతే.. అబ్దుల్ కరీమ్‌కు అప్పటికే వివాహమైందని, ఒక బిడ్డకు తండ్రి కూడా అని తెలిసిందన్నారు. అబ్దుల్ కరీం అబద్దాలకోరుడని, అందుకే పిల్లలతో కలిసి తిరిగి తన ఇంటికి వెళ్లిపోతున్నానంటూ చెప్పింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు