AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పెద్ద మనసు తల్లీ..చెత్త కుప్పలో దొరికిన శిశువుకు ఆస్తి రాసిచ్చేందుకు ముందుకొచ్చింది

చెత్తకుప్పలో దొరికిన ఓ మహిళ ముక్కు మోహం తెలియని ఓ శిశువుని చేరదీసింది. అంతేకాదు ఆ చిన్నారికి ఏకంగా తన ఆస్తిలో సగం వాటాను రాసివ్వడానికి ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ జిల్లా జయంతి నగర్ లో లత అనే మహిళ ఉంటోంది.

ఎంత పెద్ద మనసు తల్లీ..చెత్త కుప్పలో దొరికిన శిశువుకు ఆస్తి రాసిచ్చేందుకు ముందుకొచ్చింది
Baby
Aravind B
|

Updated on: Apr 18, 2023 | 6:42 AM

Share

చెత్తకుప్పలో దొరికిన ఓ మహిళ ముక్కు మోహం తెలియని ఓ శిశువుని చేరదీసింది. అంతేకాదు ఆ చిన్నారికి ఏకంగా తన ఆస్తిలో సగం వాటాను రాసివ్వడానికి ముందుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని అలిగఢ్ జిల్లా జయంతి నగర్ లో లత అనే మహిళ ఉంటోంది. సొమవారం రోజున ఉదయం పాల కోసం రోడ్డుపై వెళ్తోంది. ఈ క్రమంలో ఓ చెత్తకుప్పలో నుంచి చిన్నారి ఏడుస్తున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. అయితే అక్కడికి వెళ్లి చూడగా ఓ శిశువు కనిపించింది.

దీంతో వెంటనే ఆ బిడ్డను తీసుకుంది. అక్కడ ఉన్న స్థానికులందరిని ఈ బిడ్డ గురించి ఆరా తీసింది. అయితే ఎవరూ కూడా తమకు తెలియదని చెప్పకపోవడంతో చివరికి ఆ పాపను తన ఇంటికి తీసుకెళ్లింది. స్నానం చేయించి, పాలు పట్టించింది. అనంతరం ఆ బిడ్డను దత్తత తీసుకుంది. అలాగే తన పేరు మీద ఉన్న ఆస్తిలో సగం వాటాను రాస్తానని ముందుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానికులు లత పెద్ద మనసును చూసి అభినందించారు. చిన్నారి విషయం పోలీసులకు తెలియడంతో వారు చైల్డ్ హెల్ప్‌లైన్ కు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం