బావిలో పడ్డ జింకను రక్షించిన గ్రామస్థులు.. దప్పిక తీర్చుకోవడానికి వచ్చి.. 

| Edited By: శివలీల గోపి తుల్వా

Jul 24, 2023 | 1:49 PM

Khammam District: అడవుల్లో ఉండే జంతువులు అడవులను వదిలి గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవులు అంతరించిపోవటంతో పాటు అడవుల్లో నీరు దొరకక జనం సంచారించే ప్రాంతాలకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. అడవిలో..

బావిలో పడ్డ జింకను రక్షించిన గ్రామస్థులు.. దప్పిక తీర్చుకోవడానికి వచ్చి.. 
Villagers Rescuing Deer
Follow us on

ఖమ్మం జిల్లా న్యూస్, జూలై 24: అడవుల్లో ఉండే జంతువులు అడవులను వదిలి గ్రామాల్లోకి వస్తున్నాయి. అడవులు అంతరించిపోవటంతో పాటు అడవుల్లో నీరు దొరకక జనం సంచారించే ప్రాంతాలకు వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. అడవిలో సంచారించే ఓ జింక అరణ్యాన్ని వదిలి గ్రామం బాట పట్టింది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపోలు గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో జింక కనిపించింది.

గ్రామ సమీపంలో దట్టమైన చెట్లు ఉండటంతో వాటి నుంచి బయటకు వచ్చిన జింక దప్పిక తీర్చుకోవటానికి బావి వద్దకు వచ్చి అందులో పడింది. జింక బయటికి రాలేక ఆ బావిలోనే ఉండిపోయింది. అది గమనించిన గ్రామస్తులు జింకను బయటికి తీసి అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దీనితో తమ గ్రామంలోకి జింక వచ్చిందని విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు చూడటానికి తండోపతండాలుగా వచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.