AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పెంపుడు కుక్క పంచాయతీ.. పోలీసులు ఏం చేశారో తెలుసా..?

పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణపడి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఆ ఇద్దరు ఆ కుక్క నాదంటే నాదని వాగ్వివాదానికి పోలీసులు తలలు పట్టుకున్నారు.

పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన పెంపుడు కుక్క పంచాయతీ.. పోలీసులు ఏం చేశారో తెలుసా..?
Pet Dog
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 13, 2024 | 4:56 PM

Share

పెంపుడు కుక్క కోసం ఇద్దరు యువకులు ఘర్షణపడి పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో జరిగింది. ఆ ఇద్దరు ఆ కుక్క నాదంటే నాదని వాగ్వివాదానికి పోలీసులు తలలు పట్టుకున్నారు. విధి లేని పరిస్థితిలో ఆ మూగ జీవిని డాగ్ ఫామ్‌కు పంపారు.

నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామానికి చెందిన సారయ్య అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఎనిమిది నెలల క్రితం మిస్సయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుక్క కోసం కుటుంబ సభ్యులు అంతా గాలించారు. కానీ ఎక్కడ ఆ కుక్క ఆచూకీ లభించలేదు. అయితే, నెల్లికుదురు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సంచార జాతికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి వద్ద అచ్చం తనలాంటి పెంపుడు కుక్కే కనిపించింది. ఆ పెంపుడు కుక్క కూడా సారయ్యను చూడగానే పరిగెత్తుకుంటూ తన వద్దకు వచ్చింది. ఆ కుక్క తన పెంపుడు కుక్క అని భావించిన సారయ్య తన వెంట తీసుకెళ్లాడు.

విషయం తెలుసుకున్న వెంకటేష్, కుక్కను తీసుకెళ్లిన సారయ్య వద్దకు వెళ్ళాడు. తన స్నేహితుడు పెంచుకోమని ఇచ్చిన కుక్కను నువ్వెలా తీసుకెళ్తావ్ అంటూ గొడవ పడ్డాడు. ఈ కుక్క నాదంటే, నాదంటూ ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదు చేసుకున్నారు. ఎవరికివారు నాదే అని పోలీసుల ముందు కూడా వాగ్వివాదాన్ని దిగారు. ఈ క్రమంలో ఎటు తేల్చలేకపోయిన పోలీసులు, ఈ కుక్కను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని డాగ్ ఫామ్ కు తరలించారు. ఆ కుక్క ఎవరిదో తెలిసేందుకు విచారణ జరుగుతుందన్నారు పోలీసులు.

వీడియో చూడండి…

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..