Police Dog: చనిపోయిన శునకాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న పోలీసులు..!

గోల్డీ 2016 బ్యాచ్ అధికారి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోతే నిజామాబాద్ జిల్లాలో పోలీసులంతా కంట తడి పెట్టారు. నివాళ్ళు అర్పించారు. విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు.

Police Dog: చనిపోయిన శునకాన్ని చూసి కన్నీళ్ళు పెట్టుకున్న పోలీసులు..!
Police Dog
Follow us

|

Updated on: Sep 13, 2024 | 3:35 PM

గోల్డీ 2016 బ్యాచ్ అధికారి.. ఇటీవల అనారోగ్యంతో చనిపోతే నిజామాబాద్ జిల్లాలో పోలీసులంతా కంట తడి పెట్టారు. నివాళ్ళు అర్పించారు. విశిష్ట సేవలను గుర్తు చేసుకున్నారు. ఇంతకీ ఎవరూ అనుకుంటున్నారా..? అదొక స్పెషల్ డాగ్..! నిజామాబాద్ జిల్లా పోలీస్ విభాగంలో పనిచేసి అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది.

మందుపాతరలు గుర్తు పట్టే శునకం.. నిజామాబాద్ రేంజ్ పోలీసులతో పని చేసేదీ. ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయింది. దీంతో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. బ్యాండ్ వాయించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. అదనపు డీసీపీ అడ్మిన్ కోటేశ్వర్ రావు నివాళులు అర్పించారు.

గోల్డీ స్పెషాలిటీర్ అంతా ఇంతా కాదు. 2016 బ్యాచ్ నుంచి విధులు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్ పర్యటనల్లో పనిచేసింది. అనేక పతకాలు, ప్రశంసా పత్రాలు సాధించింది. ఆ గోల్డీ పనితీరును చూసిన పోలిసులు అంతా విషయం తెలిసి బాధపడ్డారు. అంత్యక్రియల సందర్బంగా ఆర్మూడ్ రిజర్వు ఏసీపీ నాగయ్య, అరుణ్ కుమార్ తదితర పోలీసులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గోల్డీకి కడసారి వీడ్కోలు పలికారు.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..