Telangana: లారీ నడుపుతూ నిద్రొస్తుందని కనురెప్పలు వాల్చడు..అంతే తీరా లేచి చూసే సరికి..

|

Oct 28, 2024 | 7:36 AM

సదాశివపేట జాతీయ రహదారి పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తే షాక్ అవుతారు. అది ఏంటంటే..

Telangana: లారీ నడుపుతూ నిద్రొస్తుందని కనురెప్పలు వాల్చడు..అంతే తీరా లేచి చూసే సరికి..
Road Accident
Follow us on

నిద్రమత్తు మరియు అతివేగం ఇద్దరు ప్రాణాలను బలిగొంది.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘట్కేసర్ నుండి మహారాష్ట్ర వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో ఆ లారీని రోడ్డుపక్కన నిలిపారు. అదే రహదారి పై వేగంగా వస్తున్న మరో లారీ వచ్చి ఢీ కొనడంతో లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒక వ్యక్తి లారీ క్యాబిన్లో ఇరుక్కుపోగా స్థానికులు 108 వాహన సిబ్బంది కలిసి అతనిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి