
దసరా పండుగ నాడు అమ్మమ్మ ఇంటికి వంటకాలు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ మృతి చెందారు. తిరుమలగిరి మండలం మాలిపురం గ్రామానికి చెందిన వేముల నాగరాజు(26) ఆరు నెలల కిందటే పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికైయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. పేద కుటుంబానికి చెందిన నాగరాజు ఉద్యోగం సాధించడంతో వారి కుటుంబంలో వెలుగులు నిండాయి. తమ్ముడు కార్తీక్(24) డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దసరా పండుగ రోజున వండిన వంటకాలను తుంగతుర్తిలోని అమ్మమ్మకు ఇచ్చి తిరిగి సొంతూరుకు వస్తుండగా, బండ రామారం క్రాస్ రోడ్డు వద్ద వారి బైక్ అదుపుతప్పి బండను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది చదవండి: కొండ కింద నల్లటి ఆకారం.. కెమెరాకు పని చెప్పి జూమ్ చేయగా దిమ్మతిరిగింది
తొలుత సూర్యాపేట ఆసుపత్రికి అనంతరం నార్కట్పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ నాగరాజు కూడా మృతి చెందాడు. కొడుకు పోలీస్ ఉద్యోగం సాధించాడన్న ఆనందం ఆ పేద తల్లిదండ్రులకు పూర్తిగా మిగలకుండానే, పెళ్లి కూడా కాని ఆ ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఆ కుటుంబాన్ని, గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు డ్రైవర్గా స్థిరపడి కళ్ల ముందే తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించింది. కానీ ఆ కుటుంబానికి , దసరా పండుగ రోజున ఇంతటి ఘోర విషాదం ఎదురైంది. తుంగతుర్తి పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి: అక్కడికి ఎలా ఎక్కావు మావ.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే