AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్

టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వైట్ హౌస్‌ను సందర్శించి తన అనుభవాలను పంచుకున్నారు. అది తాను ఊహించినంత భారీగా లేదని, కానీ భద్రత అద్భుతమని తెలిపారు. హైదరాబాద్ ప్రభుత్వ భవనాల తో పోలిస్తే వైట్ హౌస్ మీడియా విభాగం చిన్నదని చెప్పారు.

వైట్ హౌస్‌ని సందర్శించిన టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్
Tv9 Telugu Md Rajinikanth
SN Pasha
|

Updated on: Jul 01, 2026 | 9:47 PM

Share

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ గురించి సాధారణంగా అందరికీ ఒక భారీ భవనం అనే అభిప్రాయం ఉంటుంది. టెలివిజన్‌లో కనిపించే దృశ్యాలు, అంతర్జాతీయ వార్తల కారణంగా అది ఎంతో విశాలమైన ప్రాంగణం, వందలాది మంది సిబ్బంది, భారీ సదుపాయాలతో ఉంటుందని చాలామంది ఊహిస్తారు. అయితే అక్కడ ప్రత్యక్షంగా వెళ్లిన తర్వాత వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా అనిపించిందని టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ వెల్లడించారు. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా తొలిసారిగా వైట్ హౌస్‌ను సందర్శించిన ఆయన, అక్కడి అనుభవాలను పంచుకున్నారు. వైట్ హౌస్ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత భవనం పరిమాణం, ముఖ్యంగా మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ బ్రీఫింగ్ రూమ్స్, వర్క్ స్పేస్ చూసి ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు.

“టీవీలో చూసినంత భారీ సెటప్ అక్కడ కనిపించలేదు. ముఖ్యంగా మన హైదరాబాద్‌లోని ప్రభుత్వ భవనాలు, వాటి మీడియా సదుపాయాలతో పోలిస్తే వైట్ హౌస్‌లోని మీడియా విభాగం చాలా చిన్నదిగా అనిపించింది. మన ప్రగతి భవన్ వంటి ప్రభుత్వ సముదాయాలు పరిమాణంలో ఎంతో పెద్దవిగా ఉన్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే భవనం పరిమాణం చిన్నదైనా భద్రత విషయంలో మాత్రం వైట్ హౌస్‌కు సాటే లేదని రజినీకాంత్ అన్నారు. అక్కడ ప్రతి అడుగులోనూ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు అమలులో ఉంటాయని, అనుమతులు లేకుండా ఎవరికీ ప్రవేశం ఉండదని వివరించారు. భవనం ఎంత పెద్దది అనేది కంటే, భద్రత, నిర్వహణ, వ్యవస్థల పారదర్శకతకు అక్కడ అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు.

అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి పరిస్థితుల గురించి కూడా ఆయన స్పందించారు. తెలుగు రాష్ట్రాలు, అమెరికా మధ్య ఎన్నో దశాబ్దాలుగా బలమైన విద్యా, ఉపాధి సంబంధాలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్, వీసా నిబంధనల కారణంగా భారతీయులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు, ఐటీ నిపుణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయపడ్డారు. కొత్త విధానాల ప్రభావంతో అమెరికాలో చదువుతున్న విద్యార్థులపై ఒత్తిడి పెరిగిందని, ఉద్యోగాల్లో ఉన్నవారిలోనూ భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు చొరవ చూపాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్తులో అమెరికాకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్యపైనా ఈ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Follow Us