AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఏడో రోజూ బాదేశారు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..!

Today Petrol and Diesel Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. వరుసగా ఆరో రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజాగా లీటర్..

Petrol Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఏడో రోజూ బాదేశారు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..!
Shiva Prajapati
| Edited By: Team Veegam|

Updated on: Feb 15, 2021 | 12:29 PM

Share

Today Petrol and Diesel Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్. వరుసగా ఏడో రోజు కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. తాజాగా పెరిగిన రేట్లతో హైరదాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ. 92.53 కు లభిస్తుండగా.. డీజిల్ రూ. 86.55 గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.10 ఉండగా, డీజిల్‌ లీటర్‌ రూ. 88.60 గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ. 87.47 గా ఉంది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 88.99గా ఉంది. డీజీల్ లీటర్ ధర రూ. 79.35 గా ఉంది. అయితే, వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలను చూసి సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు నిత్యావసర ధరలు మండిపోతుండగా.. మరోవైపు పెట్రోల్, డీజీల్ ధరలు కూడా పెరిగితుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Nara Rohith: మరో ప్రయోగం చేయనున్న నారా రోహిత్‌.. ఈసారి 1970లో జరిగిన యుద్ధం నేపథ్యంలో..

Girl Suicide: విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య