Telangana: ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజుల పాప మృతి.. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువులు ఆందోళన..

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhdrachalam)ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పుట్టిన 3 రోజుల చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది అని ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు..

Telangana: ప్రభుత్వ ఆస్పత్రిలో మూడురోజుల పాప మృతి.. వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువులు ఆందోళన..
3 Days Baby Dead
Follow us

|

Updated on: Jan 19, 2022 | 11:49 AM

Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhdrachalam)ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పుట్టిన 3 రోజుల చిన్నారి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందింది అని ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రిందట ఆంధ్రా లోని నెల్లిపాక (nellipaka)మండలంలోని కాపారం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న పురిటి నొప్పులతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరింది. ఆరోజు పండంటి చిన్నారి ఆడ శిశువు కు జన్మనిచ్చింది. పుట్టిన మూడు రోజుల తర్వాత కొద్దిగా  కామెర్లు వుండడం తో సి.ఎన్.సి కేంద్రంలో శిశువు ను ఉంచి తల్లిపాలు ఇస్తూ శిశువు ఆరోగ్యంగానే ఉంది అని వైద్యులు తెలిపారు అని బంధువులు ఆరోపిస్తున్నారు.

మూడో రోజు మధ్యాహ్నం శిశువు కి తల్లి పాలు ఇచ్చిన తర్వాత శిశువు ను శిశువుల స్పెషల్ రూమ్ లో తీసుకెళ్లి ఉంచారు అని ఓ గంట తర్వాత వచ్చి శిశువు చనిపోయింది అని ఆసుపత్రి సిబ్బంది శిశువు ను తెచ్చి బంధువులకు అప్పగించారు అని బంధువులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఉమ్మనీరు మింగిన కారణంగా స్పెషల్ రూమ్ లో వుంచినా, ఎటువంటి అనారోగ్యంతో బాధపడని చిన్నారి ఇప్పుడు అకస్మాత్తుగా ఎలా చనిపోతుంది అని ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు.

తమకేమీ సంబంధం లేదని శిశువు కి తల్లిపాలు ఇచ్చిన తరువాత శిశువును తల్లి పట్టించుకోకపోవడంతో శిశువు మృతి చెంది ఉంటుంది వైద్యులు తెలిపారు. శిశువు పచ్చగా మారడంతో పచ్చ కామెర్లు ఎక్కువై శిశువు మృతి చెందింది అని బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయి అని బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్యులను నిలదీశారు. వైద్యులు మాత్రం శిశువు మృతికి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది కారణం కాదని అంటున్నారు. శిశువు మరణం పట్ల ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆసుపత్రి సూపర్ డెంట్   రామకృష్ణ సూచించారు. అప్పుడు విచారణ చేసి శిశువు మృతికి కారణమైన సిబ్బందితో పాటు వైద్యుల పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపర్ డెంట్   రామకృష్ణ శిశువు బంధువులకు నచ్చ చెప్పారు. దీంతో శిశివు బంధువులు శిశువు ను తీసుకుని ఆసుపత్రి నుండి వెళ్లిపోయారు.

Also Read: ఈ శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ మీల్స్.. ఏ ఒటిటిలో నైనా అఖండ సహా భారీ షోలు సందడే సందడి..

Latest Articles
రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో..
రషీద్ భాయ్.! ఎందుకీ తలపొగరు.. చేజేతులా మ్యాచ్‌ను చెడగొట్టావ్ పో..
పప్పు, బియ్యానికి పురుగులు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలంటే
పప్పు, బియ్యానికి పురుగులు పట్టకుండా ఎలా నిల్వ చేసుకోవాలంటే
పెళ్లి వేడుకలో బిర్యానీ లొల్లి.. చికెన్‌ లెగ్‌పీస్‌ కోసం కోట్లాట
పెళ్లి వేడుకలో బిర్యానీ లొల్లి.. చికెన్‌ లెగ్‌పీస్‌ కోసం కోట్లాట
భళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా ఊహించని ప్రమాదం.. స్పాట్లోనే
భళ్లారి నుంచి గుంటూరు వస్తుండగా ఊహించని ప్రమాదం.. స్పాట్లోనే
అనుకూలంగా గురు గ్రహం.. ఆరు రాశులకు ఆకస్మిక ధన ప్రాప్తి..!
అనుకూలంగా గురు గ్రహం.. ఆరు రాశులకు ఆకస్మిక ధన ప్రాప్తి..!
7.3 అడుగులు పొడవున్న యువతి.. బాస్కెట్ బాల్ కోర్టులో అడుగు..
7.3 అడుగులు పొడవున్న యువతి.. బాస్కెట్ బాల్ కోర్టులో అడుగు..
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం ప్రధానాంశాలు ఇవే..!
పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగం ప్రధానాంశాలు ఇవే..!
ఒక్క నిమిషం నిబంధన.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద తల్లిదండ్రుల దీనస్థితి
ఒక్క నిమిషం నిబంధన.. ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద తల్లిదండ్రుల దీనస్థితి
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా? లేదా?
ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా? లేదా?
మద్యం మత్తులో ఎంపీకి కాల్‌చేసిన మందుబాబు..అర్ధరాత్రి దుకాణం
మద్యం మత్తులో ఎంపీకి కాల్‌చేసిన మందుబాబు..అర్ధరాత్రి దుకాణం
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ముర్ము
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ముర్ము
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర