AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రాజ్‌ గోపాల్‌ రెడ్డి వ్యూహం మార్చారా.? ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.?

అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల బరిలో నిలిచిపోయాయి. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొన్ని స్థానాలకు ఎవరు బరిలో ఉంటారు అనే క్లారిటీ ఉన్న చాలా నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత లేదు. సీనియర్‌లు పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. కొందరు నేతలు తాము పలానా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తామని...

Telangana: రాజ్‌ గోపాల్‌ రెడ్డి వ్యూహం మార్చారా.? ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.?
Komati Reddy
Ashok Bheemanapalli
| Edited By: Narender Vaitla|

Updated on: Oct 19, 2023 | 10:43 PM

Share

కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మునుగోడు నుంచి చేస్తారా.? ఎల్బీ నగర్‌ నుంచి పోటీలో నిలవనున్నారా.? లేదా ఆయన శ్రీతి కూడా పోటీ చేయనున్నారా.? ఇలా రాజ్‌ గోపాల్ రెడ్డి పోటీ చుట్టూ ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి.

అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్‌ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల బరిలో నిలిచిపోయాయి. అయితే బీజేపీ మాత్రం తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. కొన్ని స్థానాలకు ఎవరు బరిలో ఉంటారు అనే క్లారిటీ ఉన్న చాలా నియోజక వర్గాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత లేదు. సీనియర్‌లు పోటీ చేస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. కొందరు నేతలు తాము పలానా నియోజక వర్గం నుంచి పోటీ చేస్తామని చెబుతున్నారు. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో సీఎం పై కూడా పోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తామని మరి కొందరు అంటున్నారు.

ఇక గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. రీసెంట్‌గా జరిగిన బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన ఆయన తాను రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. మునుగోడు ప్రజలు, ఏల్బీ నగర్ ప్రజలు పోటీ చేయాలని కోరుతున్నారని, ఎక్కడ నుంచి పోటీ చేసిన గెలుస్తానని అన్నారు. అయితే ఎల్బీనగర్ నగర్ నుంచి పోటీ చేస్తానన్న బాంబ్‌ పేల్చడంతో అయన వ్యాఖ్యల పై పార్టీలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.. అయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనే మాట్లాడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇంతకు రాజ్ గోపాల్ రెడ్డీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే స్పష్టత తో ఉన్నారా లేక సందిగ్ధత తో ఉన్నారా అనే సందేహం వ్యక్తం అవుతుంది. ఆయన రెండు నియోజక వర్గాల్లో కాలు పెట్టారా అని అనుకుంటున్నారు. లేదంటే ట్విస్ట్ కోసమే అలా మాట్లాడారా అనే చర్చ కూడా జరుగుతోంది.

రాజ్ గోపాల్ రెడ్డి ఎల్బీ నగర్‌ నుంచి పోటీలో దిగి.. ఆయన భార్య కోమటి రెడ్డి లక్ష్మినీ మునుగోడు నుంచి పోటీ చేస్తారని మరో మాట కూడా వినిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులను ప్రకటించే వరకు ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉంటాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్న ఆశావహులు కోమటి రెడ్డి ప్రకటనతో కంగు తిన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..