తెలంగాణ: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పదో తరగతి పరీక్షా సమయం పొడిగింపు..
టెన్త్ పరీక్ష సమయాన్ని మరో అరగంట పొడిగిస్తున్నట్లు పవిత్ర ఇంద్రా రెడ్డి గారు తెలిపారు, గతంతో పోలిస్తే మూడు గంటల పదిహేను నిమిషాలు పరీక్ష

medical Students
పదో తరగతి విద్యార్ధులకు గుడ్ న్యూస్. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ పరీక్షల సమయాన్ని మరో అర్ధ గంట పెంచింది. దీనితో ఇకపై పది పరీక్షలు 3 గంటల 15 నిమిషాల పాటు జరుగుతాయి. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. 6 పేపర్లతోనే పరీక్ష జరగనుంది. కరోనా కారణంగా విద్యార్ధులపై పడే ఒత్తిడిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి. అలాగే మారిన టైమింగ్స్ ప్రకారం ఈ ఎగ్జామ్స్ను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహిస్తారు.
