AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లో రూ.6 వేల చొప్పున వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులు మరికొంతమంది రైతులకు శుక్రవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలవరకు భూమి ఉన్న రైతులకు ఇవాళ రిలీజ్ చేసింది. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇవి నేరుగా జమ అయ్యాయి. దీంతో రైతులు చెక్ చేసుకోవాలి.

Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లో రూ.6 వేల చొప్పున వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
Rythu Bharosa
Venkatrao Lella
|

Updated on: Jul 03, 2026 | 9:14 PM

Share

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులు విడుదల చేస్తోంది. విడతల వారీగా డబ్బులను ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి రోజున రెండు ఎకరాల్లోపు ఉన్నవారికి జమ చేయగా.. ఇప్పటివరకు నాలుగు ఎకరాల వరకు అందించారు. తాజాగా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం విడుదల చేసింది. శుక్రవారం 4.41 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.1188 కోట్లు రిలీజ్ చేసింది. ఇప్పటివరకు మొత్తం 65.76 లక్షల మంది లబ్దిదారులకు రైతు భరోసా నిధులు అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం రూ.6590 కోట్లు విడుదల చేసింది.

ఎకరానికి రూ.6 వేలు

జూన్ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి వీటిని రిలీజ్ చేస్తోంది. ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు రూ.9 వేల కోట్లను అందించనుంది. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి రోజు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రూ.2482 కోట్లను విడుదల చేసింది. తొలి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున జమ అయింది. తొమ్మది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్లను జమ చేయనుంది. రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. వీటిని రెండు విడతల్లో అందిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయంగా వీటిని ఇస్తోంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకం పేరుతో అమలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారికి కూడా రైతు భరోసా అందిస్తోంది. ఇందుకోసం జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

-https://rythubharosa.telangana.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

-హోమ్ పేజీలో లాగిన్‌పై క్లిక్ చేయండి

-లబ్దిదారుడి పేరు, పాస్ వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి

-వివరాలు లేకపోతే లాగిన్ బై మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

-లాగిన్ అయ్యాక బెనిఫిషియరీ స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

-ఆధార్ నెంటర్ లేదా పట్టాదారు పాస్ బుక్ నెంటర్ ఎంటర్ చేయండి

-అనంతరం సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయండి

Follow Us