TRS vs BJP: సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు.. ప్రహరీలపై పోస్టర్లు.. పీక్స్‌కు చేరిన టీఆర్‌ఎస్‌, బీజేపీల వార్‌

|

Sep 14, 2022 | 9:42 PM

Telangana Politics: సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతల ప్రసంగాలు, వారి వ్యవహార శైలిపై ఏ చిన్న లూప్‌ హోల్ దొరికినా ఆడేసుకుంటుంటారు.

TRS vs BJP: సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు.. ప్రహరీలపై పోస్టర్లు.. పీక్స్‌కు చేరిన టీఆర్‌ఎస్‌, బీజేపీల వార్‌
Trs Vs Bjp
Follow us on

Telangana Politics: సోషల్ మీడియాలో టీఆర్‌ఎస్‌-బీజేపీ మధ్య వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతల ప్రసంగాలు, వారి వ్యవహార శైలిపై ఏ చిన్న లూప్‌ హోల్ దొరికినా ఆడేసుకుంటుంటారు. దీని కోసం సోషల్ మీడియాలో ఓ మినీ ప్రపంచ యుద్ధమే జరుగుతోంది. ఫేస్‌బుక్, ట్విటర్ అన్న తేడా లేకుండా ఏం జరిగినా అవే ట్రెండింగ్‌. లేటెస్ట్‌గా తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో ఫేస్‌బుక్‌లో సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకరమైన ఫొటో పోస్ట్‌ చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం మండిపడింది. చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెడితే.. అటు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి.

బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ల పక్కన.. కంటోన్మెంట్ యువత పేరుతో చెక్‌ పోస్ట్ దగ్గరున్న ప్రహారీలపై అంటించారు. ఐటీఐఆర్, మెడికల్ కళాశాలలు, ప్రాజెక్టులకు జాతీయ హోదాలాంటి 20 అంశాలను అందులో లేవనెత్తారు. వీటిని తెలంగాణ ప్రజలకు అందించి కేంద్రం చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. పాదయాత్రలతో ప్రజాసమస్యలు తీరవని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చేందుకే ఉందని కౌంటర్‌ ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ గట్టుమీద పోస్టులు.. పోస్టర్లు కాకరేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..