AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు.. కేంద్ర మంత్రిపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ మధ్య పొలిటికల్ వార్ వేడి పుట్టిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా నేతలందరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది..

KTR: పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారు.. కేంద్ర మంత్రిపై కేటీఆర్ ఫైర్
Minister Ktr
Ganesh Mudavath
|

Updated on: Dec 18, 2022 | 7:07 AM

Share

తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ మధ్య పొలిటికల్ వార్ వేడి పుట్టిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా నేతలందరూ విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి కేటీఆర్.. కేంద్రం తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ లోక్‌సభలో చేసిన ప్రకటనపై ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బల్క్‌ డ్రగ్స్‌ పార్కుని ఏపీకి ఇచ్చినట్లు రాతపూర్వకంగా.. తెలంగాణకు కేటాయించినట్లు మౌఖికంగా చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ‘‘ కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ.. పెద్ద అబద్ధంతో తెలంగాణ హృదయాన్ని గాయపరిచారని” ఆవేదన వ్యక్తం చేశారు. జాతి ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేటీఆర్ ఆసహనం వ్యక్తం చేశారు.

అబద్ధాలతో పార్లమెంట్‌ను కేంద్రమంత్రి తప్పుదోవ పట్టించారు. ఆయనపై లోక్‌భలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలి. తప్పుదోవ పట్టించినందుకు కేంద్రమంత్రి మాండవీయ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. బల్క్ డ్రగ్ పార్క్‌ను ప్రముఖ లైఫ్-సైన్సెస్ హబ్‌కు తిరస్కరించడం దారుణం. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే అధికంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

– ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్..

లోక్ సభలో కేంద్రమంత్రి చేసిన ప్రకటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశంలో మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని చెప్పిన ఆయన.. ఒక్కో దానిపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో పార్కు ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన దరఖాస్తును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే.. ఇప్పటికే తెలంగాణలో పాటు, ఆసక్తి చూపించిన రాష్ట్రాలకు రూ.300 కోట్లు ఇచ్చామని చెప్పడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..