Shamshabad: ‘నువ్వు చచ్చిపో.. ఇంకో పెళ్లి చేసుకుంటా.. భారీగా కట్నం వస్తుంది’

|

May 26, 2023 | 1:07 PM

కట్టుకున్న భార్యను అంతమొందించేందుకు ఓ పతి దేవుడు రాక్షస రూపం దాల్చాడు. నమ్మించి విదేశాలకు కూడా తీసుకెళ్లాడు. తిండి పెట్టకుండా ఓ గదిలో బంధించి నిత్యం నరకం చూపసాగాడు. భార్య చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చని, కట్నం కూడా వస్తుందని..

Shamshabad: నువ్వు చచ్చిపో.. ఇంకో పెళ్లి చేసుకుంటా.. భారీగా కట్నం వస్తుంది
Husband Harassment
Follow us on

కట్టుకున్న భార్యను అంతమొందించేందుకు ఓ పతి దేవుడు రాక్షస రూపం దాల్చాడు. నమ్మించి విదేశాలకు కూడా తీసుకెళ్లాడు. తిండి పెట్టకుండా ఓ గదిలో బంధించి నిత్యం నరకం చూపసాగాడు. భార్య చచ్చిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చని, కట్నం కూడా వస్తుందని కలలుగన్నాడు. చిత్రహింసలు భరించలేక భార్య అతి కష్టం మీద స్వదేశానికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. శంషాబాద్‌ మండలానికి చెందిన యువతి గాథ ప్రతిఒక్కరినీ కలచివేస్తోంది. ఇన్స్‌పెక్టర్‌ ఎ శ్రీధర్‌ కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ మండలానికి చెందిన యువతి (32)కి శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్‌రెడ్డితో 2017లో వివాహం జరిగింది. పెద్దల కుదిర్చిన వివాహం ఇది. పెళ్లయిన తర్వాత దంపతులిద్దరూ అమెరికాకు వెళ్లారు. వీరికి ఓ కొడుకు సంతానం. కొంతకాలంపాటు వీరి కాపురం సజావుగానే సాగిన క్రమంగా ప్రవీణ్‌ నిజస్వరూపం బయటపెట్టసాగాడు. అదనపు కట్నం కోసం ప్రవీణ్‌రెడ్డి భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. అదనపు కట్నం కోసం వేధించేవాడు.

పైగా ‘నువ్వు చచ్చిపోతే.. వేరొక పెళ్లి చేసుకుంటాను. అధిక కట్నం వస్తుంది’ అంటూ మానసికంగా హింసించేవాడు. ఇలా పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇటీవల శంషాబాద్‌కు చేరుకున్న యువతి భర్తపై ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.