ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి తెలంగాణ హైకోర్ట్ ఝలక్ ఇచ్చింది. నిజామాబాద్లో ఓ వర్గం ప్రజలను ఉద్దేశిస్తూ.. 2012లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో అక్బరుద్దీన్పై కేసు నమోదై.. అరెస్ట్ కూడా అయ్యారు. అనంతరం బెయిల్పై బయటికి వచ్చిన ఆయన.. ఇటీవల మరోసారి ఓ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్బరుద్దీన్పై హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అయితే బెయిల్పై ఉన్న అక్బరుద్దీన్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ.. న్యాయవాది కరుణాసాగర్ హై కోర్ట్లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన కోర్ట్.. అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు.. CBCID పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, రెండు రోజుల క్రితం కూడా అక్బరుద్దీన్ ఇదే కేసు విచారణ నిమిత్తం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు.