Telangana: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సీక్రెట్ దోస్తానా.. షాకింగ్ కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కారణంగానే ఈడీ అధికారులతో..

Telangana: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య సీక్రెట్ దోస్తానా.. షాకింగ్ కామెంట్స్ చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..
Revanth Reddy
Follow us

|

Updated on: Oct 03, 2022 | 9:08 PM

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కారణంగానే ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందన్నారు. ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి వారిని బీజేపీ లోకి చేర్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే భయంతోనే.. గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారన్నారు. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలోనే కేసును మూసేశారని గుర్తు చేశారు. రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే కేసును మళ్లీ తెరిచారని ఆరోపించారు. అందుకే ఈడీ అధికారులను ఉసిగొలిపి రాహుల్ గాంధీ గారిని విచారణకు పిలిచారన్నారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడ్డారని బీజేపీ సర్కార్‌ తీరును దుయ్యబట్టారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కర్ణాటకలో భారత్ జోడో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్ ను ఈడీ విచారణకు పిలిచిందన్నారు. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోందని, ఈడీ అంటే బీజేపీ తన ఎలక్షన్ డిపార్ట్‌మెంట్ గా మార్చుకుందని విమర్శించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ కాంగ్రెస్ నేతలనూ ఈడీ నోటీసుల పేరుతో వేధించే ప్రయత్నం చేస్తోందని బీజేపీపై ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసుల్చిందన్నారు. కోటి రూపాయల చందా ఇచ్చినందుకు అయిదుగురు నేతలకు నోటీసులిచ్చారని, వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీకి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆరేడేళ్లలో బీజేపీకి 4841 కోట్ల రూపాయలు చందాలు వచ్చాయని, అధికారంలో ఉన్నారనే వారికి చందాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వలేదని దుయ్యబట్టారు రేవంత్.

ఇదే సమయంలో కేసీఆర్ పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశానని అన్నారు. స్పష్టమైన నివేదిక ఇస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదన్నారు. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న టీఆర్ఎస్ పార్టీకి రూ. 800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

ఢీల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారని, కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగంగానే కేసీఆర్‌కు ఢిల్లీలో స్థలం ఇచ్చారన్నారు. ఇన్ని ఫిర్యాదులు చేసినా.. టీఆరెస్ నేతలకు ఒక్క నోటీసు ఇవ్వడం లేదని బీజేపీ సర్కార్ తీరును తూర్పారబట్టారు.

ఈడీ ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల పట్ల బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు రేవంత్. ఫిరాయింపుల కమిటీలో కీలక నేతలయిన కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు వస్తాయని ముందే చెప్పడం వెనక మతలబు ఏమిటీ? అని ప్రశ్నించారు కాంగ్రెస్ స్టేట్ చీఫ్. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వారిని భయపెట్టి బీజేపీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనక కుట్రను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు రేవంత్. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదు? అని ప్రశ్నించారు. ఈడీ, ఇన్ కం టాక్స్, సీబీఐ లు తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో ఉంటే కష్టమనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందన్నారు.

ఒక పార్టీ ఎదగాలంటే.. ఇంతలా దిగజారాలా?

గతంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ గెలిచినా పైసా మార్పు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలు ఇది ఆలోచించి.. ఆడబిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తామన్నారు. 11 రాష్టాల్లో ప్రజా తీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. హెరాల్డ్ కేసు ఒక రాజకీయ ప్రేరేపితమైన కేసుగా కొట్టిపారేశారు రేవంత్. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా.. వారందరినీ సమానంగానే గౌరవిస్తామన్నారు. అనుకోని కార్యక్రమాలు ఉండటం వల్లే శశిథరూర్ ను కలవలేకపోయానని వివరణ ఇచ్చారు రేవంత్.

యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు..

యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడంలేదు? అని ప్రశ్నించారు రేవంత్. కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికేనని దుయ్యబట్టారు. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ చర్యలన్నీ మోదీ సూచనలతో జరుగుతున్నవేనని అన్నారు. ఆ కారణంగానే.. ఆయనపై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలేదన్నారు. ఈఎస్ఐ కుంభకోణంపై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బలహీన పరిచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.