AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పేరు వింటేనే భగ్గుమంటున్న కేంద్రం.. కమిషనర్‌ లేఖకు స్పందిస్తుందా..?

Telangana: ధాన్యం కొనుగోళ్లపై మొండివైఖరిని వీడని కేంద్రానికి తెలంగాణ సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ లేఖ రాశారు. రా రైస్‌ తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కమిషనర్‌. బాయిల్డ్‌ రైస్‌ కావాలన్నా..

Telangana: తెలంగాణ పేరు వింటేనే భగ్గుమంటున్న కేంద్రం.. కమిషనర్‌ లేఖకు స్పందిస్తుందా..?
Subhash Goud
|

Updated on: Apr 17, 2022 | 6:58 AM

Share

Telangana: ధాన్యం కొనుగోళ్లపై మొండివైఖరిని వీడని కేంద్రానికి తెలంగాణ సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ లేఖ రాశారు. రా రైస్‌ తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు కమిషనర్‌. బాయిల్డ్‌ రైస్‌ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బియ్యం (Rice) ప్యాకింగ్‌ కోసం 15 కోట్ల బస్తాలు కావాలని లేఖలో విన్నవించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసింది తెలంగాణ సర్కారు. ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్ర మంత్రులు. అయినా స్పందించకపోవడంతో డైరెక్ట్‌గా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా రైతులతో కలిసి ఢిల్లీలో నిరసనకు దిగారు. అయినా కేంద్రం తన మొండిపట్టును కొనసాగించడంతో.. సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ధాన్యాన్ని తామే కొంటామని ప్రకటించడమే కాకుండా.. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయని కేంద్రం.. కనీసం రా రైస్‌ అయినా కొనాలని సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ లేఖ రాశారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపారు. తెలంగాణ పేరు వింటేనే భగ్గుమంటున్న కేంద్రం.. కమిషనర్‌ లేఖకు స్పందిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం బియ్యం ప్యాకింగ్‌ కోసం రాష్ట్రం అడిగిన బస్తాలనైనా పంపుతుందా అనేది ఉత్కంఠగా మారింది. మరి కేంద్రం తెలంగాణకు సహకరిస్తుందో లేక అదే మొండి వైఖరి కొనసాగిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

CM KCR: కేంద్రం పాపాల చిట్టా దొరికిందా? చర్చనీయాంశంగా గులాబీ బాస్ రాజకీయం.. మళ్లీ ఢిల్లీ వేదికగా..

Train Accident: రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఢీః.. భారీ శబ్ధం..!