
తెలంగాణలో నవంబర్ 30న జరగనున్న పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 49 లెక్కింపు కేంద్రాలను ఎంపిక చేసింది. ఇప్పటికే పనులు స్టార్ట్ చేసింది ఈసీ.
హైదరాబాద్ మహానగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
49 ఓట్ల లెక్కింపు కేంద్రాల వివరాలు
రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఓట్ల లెక్కింపు:
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ఎక్కింపు సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎల్బీనగర్ నియోజకవర్గ లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం, రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ నియోజకవర్గాల కౌటింగ్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలిలో ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
ఇక తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…