AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై.. త్వరలోనే గులాబీ గూటికి..!

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు.

Telangana Congress: కాంగ్రెస్ పార్టీకి పాల్వాయి స్రవంతి గుడ్ బై.. త్వరలోనే గులాబీ గూటికి..!
Palvai Sravanthi
Balaraju Goud
|

Updated on: Nov 11, 2023 | 10:38 AM

Share

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్ తగిలింది. దివంగత రాజ్యసభ సభ్యుడు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె, కాంగ్రెస్ కీలక నేత పాల్వాయి స్రవంతి ఆపార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన స్రవంతి మారిన రాజకీయ పరిణామాలతో గులాబీ గూటికి చేరుతున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారుతున్నారు. రాత్రి రాత్రే వీరు వారు, వారు వీరు అవుతున్నారు. ఉన్న ఫలంగా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. ఇటీవలె బీజేపీ వీడి కాంగ్రెస్ చేరిన కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డిని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం. దీంతో మునుగోడు టికెట్ అశించిన నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ వీడుతున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు మునుగోడుకు చెందిన చలమల్ల కృష్ణారెడ్డి పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు. తాజాగా పాల్వాయి స్రవంతి కూడా కాంగ్రెస్ పార్టీ వీడటంతో కార్యకర్తల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది.

ఇక స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో.. ఆమె పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు అవాస్తవమని ఇటీవల పాల్వాయి స్రవంతి కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారు. అయితే, తన పార్టీలో ప్రాధాన్యం తగ్గిందన్న మనస్తాపంతో కాంగ్రెస్ వీడుతున్నట్లు స్రవంతి తెలిపారు. ఇంతలోనే ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే త్వరలో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..