AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఊరటనిచ్చిన వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. భానుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. రానున్న మూడు రోజుల్లో ఎండలు దంచికొట్టడమే కాకుండా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఏపీలో వేడితో పాటు ఉక్కపోత కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకోండి..
Telangana And Ap Weather Update
Krishna S
|

Updated on: Apr 12, 2026 | 1:33 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడా కురిసిన జల్లులతో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ, రానున్న మూడు రోజుల్లో ఎండ తీవ్రత క్రమంగా పెరగనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. నిన్నటి వరకు మరాత్వాడ ప్రాంతంలో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడటంతో రాష్ట్రంలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీక్షణత పెరగనుంది.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి

ఏపీ, యానాం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ, నైరుతి దిశల నుండి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రాగల మూడు రోజుల పాటు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది. వర్ష సూచన ఏమాత్రం లేదని అధికారులు స్పష్టం చేశారు. రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రెండు రోజుల వరకు ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండదు.

ప్రజలకు హెచ్చరిక

కేవలం ఎండలు పెరగడమే కాకుండా కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో రాగల ఏడు రోజుల పాటు వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉండి ప్రజలు అసౌకర్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.

జాగ్రత్తలు

  • మధ్యాహ్నం వేళల్లో అనవసరంగా బయటకు రాకపోవడం మంచిది.
  • వడదెబ్బ తగలకుండా తగినన్ని నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి పానీయాలు తీసుకోవాలి.
  • వేడి, తేమ వల్ల కలిగే అసౌకర్యం నుండి తప్పించుకోవడానికి కాటన్ దుస్తులను ధరించడం ఉత్తమం.

Follow Us
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. వచ్చే 3 రోజులు వాతావరణం..
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
గుంత ఆమ్లెట్‌పై కుర్రకారు మోజు.. అసలు ఎందుకింత క్రేజు
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
రైల్వేశాఖ కొత్త రూల్.. ట్రైన్ బయల్దేరే ముందు కూడా..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
పెళ్లి చేసుకుంటే ఆ భయంకరమైన వ్యాధి రాదా..! కొత్త పరిశోధనలో..
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
రెండు రోజుల్లో 'డెకాయిట్‌' సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
అంతర్వేది సముద్ర తీరంలో జాలర్లకు ఏం చిక్కిందో చూడండి..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
గుంటూరు టాకీస్ సినిమాలో యాక్టింగ్.. పిల్లలతో కలిసి చూడలేను..
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పిన చిచ్చరపిడుగు వైభవ్
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల